Don't Miss!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వర్షం: మోడీ పాలనపై నేహా ధుపియా విమర్శ, నెటిజన్ల ఆగ్రహం
ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ పాలన పైన విమర్శలు చేసి బాలీవుడ్ బామ నేహా ధుపియా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మహారాష్ట్ర రాజధానిలో కురిసిన కుండపోత వర్షం వల్ల జనం అతలాకుతలం అయింది.
రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. చాలా కార్యాలయాలు, పాఠశాలలు మూతబడ్డాయి. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాను కూడా వర్షం కారణంగా అసౌకర్యానికి గురయ్యానని నేహా ధుపియా ట్వీట్ చేసింది.
అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీ పాలన పైన ఆమె ట్వీట్ చేసింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో ముంబై తడిసిముద్దయిందని, గుడ్ గవర్నెన్స్ అంటే సెల్ఫీలు, యోగా కాదని, ప్రజలకు భద్రత పైన భరోసా ఇవ్వాలని ట్వీట్ చేసింది.
దీనిపై ఆమెకు అనుకూలంగా, వ్యతిరేకంగా స్పందన వచ్చింది. ఎక్కువగా ఆమెకు వ్యతిరేకంగా స్పందించారు. ఆమె పబ్లిసిటీ కోసం ఇలా చేసిందని కొందరు విమర్శించారు. చేసే పనిలేక ఆమె సోషల్ మీడియాలో ఇలా విమర్శలు గుప్పిస్తోందని ఇంకొందరు అన్నారు.