Don't Miss!
- Sports KKR vs RR: కొంపముంచిన హర్షిత్ రాణా.. రాజస్థాన్ను గెలిపించిన బట్లర్!
- News బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
చెన్నై: సూపర్ స్టార్లతో సమానంగా చిన్న హీరోయిన్ విరాళం
హైదరాబాద్: మనసారా, బస్టాప్, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు చిత్రాల్లో హీరోయిన్ గానటించిన శ్రీదివ్య గురించి అందరికీ తెలిసిందే. తెలుగు అమ్మాయే అయినా తమిళంలో హీరోయిన్ గా ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటోంది. ఇటీవల భారీ వరదలతో చెన్నై నగరం అతలాకులం అయి అక్కడ ప్రజలు నిరాశ్రయులైన నేపథ్యంలో చలించిపోయిన ఆమె రూ. 10 లక్షల విరాళం ప్రకటించింది.
శ్రీదివ్య చిన్న హీరోయిన్ అయినా.... దాతృత్వంలో మాత్రం తెలుగు, తమిళంలో కొందరు సూపర్ స్టార్లతో సమానంగా ఉండటం అందరినీ ఆశ్చర్య పరించింది. ఆ పెద్ద పెద్ద స్టార్లు తాము సంపాదించే దానితో పోలిస్తే విరాళంగా ఇచ్చింది చాలా చిన్న మొత్తమే. కానీ శ్రీదివ్య తాను సంపాదించే దానితో పోలిస్తే ఇచ్చిన మొత్తం చాలా ఎక్కువే.
సౌత్ లో పెద్ద హీరోలైన అల్లు అర్జున్ 25 లక్షలు, సూర్య, కార్తి కలిపి రూ. 25 లక్షలు, జూ ఎన్టీఆర్, మహేష్ బాబు చెరో 10 లక్షలు విరాళం విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరికి ఏ మాత్రం తీసిపోకుండా చిన్న సినిమాల హీరోయిన్ శ్రీదివ్య కూడా విరాళం అందించడం విశేషం.
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన చెన్నై నగరం, తమిళనాడులోని ఇతర ప్రాంతాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ విపత్తుతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. చెన్నై నగరంలోని కొన్ని పరిస్థితులు మునుపటి స్థితికి రావడానికి కొన్ని నెలల సమయం పడుతుందని అంటున్నారు.