Don't Miss!
- News ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘అఖిల్’ ఎంట్రీ ఇక వచ్చే సంవత్సరమే...
హైదరాబాద్: అఖిల్ అక్కినేని తెరంగ్రేటం చేస్తున్న ‘అఖిల్' మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా.... పలు కారణాలతో వాయిదా పడింది. దసరా సీజన్ ముగిసింది. కనీసం దీపావళికి అయినా ‘అఖిల్' సినిమా వస్తుందని అభిమానులు ఆశించారు. అయితే ఇప్పటి వరకు యూనిట్ సభ్యుల నుండి ఎలాంటి ప్రకటన లేక పోవడంతో దీపావళికి కూడా అఖిల్ రావడం లేదని తేలిపోయింది.
దీపావళి సీజన్ ముగిసిందంటే ఇక డిసెంబర్లోనే విడుదల వీలవుతుంది. డిసెంబర్ నెల తెలుగు సినిమాలకు పెద్దగా అచ్చిరాదు. కాబట్టి అఖిల్ సినిమా అపుడు విడుదల చేసే అవకాశం లేదు. కొత్త సంవత్సరంలో సంక్రాంతికి విడుదల చేద్దామని అనుకున్నా... అపుడు మహేష్ బాబు, బాలయ్య లాంటి పెద్ద హీరోల సినిమాలు ఉండటంతో వీరితో పోటీ పడి విడుదల చేయడం సాహసమే. మరి ‘అఖల్' విడుదలపై ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అఖిల్ సినిమా ఈ సంవత్సరం విడుదల కావడం లేదనే విషయం మాత్రం స్పష్టమవుతోంది.
దసరా సందర్భంగా అక్టోబర్ 22న విడుదల కావాల్సిన ‘అఖిల్' సినిమా ఉన్నట్టుండి వాయిదా పడటంతో అభిమానులు అగ్గిమీద గుగ్గిలంలా ఫైర్ అయ్యారు. దసరాకు సినిమాను విడుదల చేస్తానని చెప్పిన నితిన్ నమ్మక ద్రోహం చేసాడంటూ, వివి వినాయక్ కుట్రదారు అంటూ అభిమానులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.
దీంతో వెంటనే నాగార్జున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. గ్రాఫిక్స్ సమస్య వల్లనే ‘అఖిల్' సినిమా వాయిదా వేయాల్సి వచ్చిందని, రాజమౌళి బాముబలి తర్వాత తెలుగు సినిమాలో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఏర్పడింది. సినిమా అంతా బావుండి గ్రాఫిక్స్ బాగోలేక పోతే చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశ్యంతో సినిమా విడుదల వాయిదా వేసినట్లు చెప్పి.... తాత్కాలికంగా అభిమానులను శాంతింప చేసారు. మరి మరోసారి అభిమానులు ఫైర్ అయితే నాగార్జున వారికి ఏం సమాధానం చెబుతారో?
అఖిల్ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమలతతో పాటు లండన్కు చెందిన లెబానా జీన్, లూయిస్ పాస్కల్, ముతినే కెల్లున్ తనాక, రష్యాకు చెందిన గిబ్సన్ బైరన్ జేమ్స్ విలన్స్ గా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్, అనూప్, థమన్, అమోల్ రాథోడ్, రవివర్మ, ఎ.ఎస్.ప్రకాష్, గౌతం రాజు, భాస్కరభట్ల, కృష్ణ చైతన్య, శేఖర్, గణేష్, జాని సాంకేతిక నిపుణులు. ఈచిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: నిఖితా రెడ్డి, నిర్మాత: నితిన్, దర్శకత్వం: వి.వి.వినాయక్.