Don't Miss!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నా వల్ల కాదు, తప్పుకుంటా: నాగార్జునకు అఖిల్ లెటర్
హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా లాంచ్ అయిన అఖిల్... భవిష్యత్తులో మంచి నటుడిగా ఎదుగుతాడు అనే నమ్మకం కల్గించాడు. అతని తొలి సినిమా ‘అఖిల్' బాక్సాఫీసు వద్ద కాస్త నిరాశ పరిచినా పెర్ఫార్మెన్స్ పరంగా, డాన్స్ పరంగా, ఫైట్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసాడు అఖిల్. అ సినిమాలో అఖిల్ ఎంతో కసిగా నటించాడు. వాస్తవానికి సినిమాల్లోకి రావాలనే కసి అఖిల్ లో చాలా కాలం నుండే ఉందట. గతంలో జరిగిన ఓ సంఘటనను నాగార్జున ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.
‘యూఎస్ఏలో అఖిల్ బిబిఎం చదువుతున్నాడు. 1 సంవత్సరం కోర్స్ పూర్తయింది. ఉన్నట్టుండి అఖిల్ నుండి భారీ లెటర్ వచ్చింది. అది చూసి అంతా షాకయ్యాం. నాకు యాక్టర్ అవ్వాలని ఉంది. ఈ చదువు నా వల్ల కాదు. ఐ వాంట్ టు క్విట్ అంటూ లేఖ రాసాడు. యాక్టర్ కావాలనే అఖిల్ కోరికను అంతా అంగీకరించాం. చదువు పూర్తి చేయాలని చెప్పాను. తర్వాత ఇండియాకి తిరిగి వచ్చాడు. యాక్టింగ్, డాన్సింగ్, ఫైటింగ్ అన్నింటిలో శిక్షణ తీసుకున్నాడు' అని నాగార్జున తెలిపారు.
అఖిల్
తర్వాతి
సినిమా
వివరాలు...
తన
తొలి
సినిమా
భారీ
స్ధాయిలో
ఖర్చు
పెట్టి
అదే
స్ధాయిలో
రిలీజ్
చేసినప్పటికీ
ఫ్లాఫ్
టాక్
తెచ్చుకుని
కాస్త
డీలా
పడ్డాడు
అఖిల్.
అయితే
చిత్రంగా
తొలి
సినిమా
రిలీజ్
కు
ముందే
స్టార్
స్టేటస్
అందుకున్నాడు.
దాంతో
ఆ
సినిమా
ఫలితం
తో
సంబందం
లేకుండా
తన
తదుపరి
ప్రాజెక్టుల
మీద
దృష్టి
పెడుతున్నాడు.
ఫిల్మ్
సర్కిల్స్
లో
వినపడుతున్నదాన్ని
బట్టి..
కమర్షియల్
విలువలతో
వచ్చిన
'అఖిల్'
కు
డివైడ్
టాక్
రావటంతో
నెక్ట్స్
సినిమాకు
సామాజిక
సందేశాలతో
ముందుకెళ్ళే
దర్శకుడిని
తీసుకున్నాడన్న
తెలుస్తోంది.
ఆ దర్శకుడు మరెవరో కాదు... క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ). క్రిష్ దర్శకత్వంలో రెండో సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు. కంచె సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించిన క్రిష్, అఖిల్ సినిమాకు ఓ కథను రెడీ చేసి చెప్పబోతున్నట్లు సమాచారం. 2016 ప్రారంభంలో ఈ సినిమాను పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమాను గతంలో నాగార్జున, నాగచైతన్యలతో సినిమాలు రూపొందించిన డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించనున్నారు.