Don't Miss!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
ఏంటి నాగార్జున కూడానా?? "నాగ్-రాగ్-ఫ్లాప్" ప్రమాదం కూడా ఉండగానే ఇంత రిస్కా..!?
ఓం కార్ ఇదివరకే తీసిన రాజు గారి గది కి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నడన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ముందు విక్టరీ వెంకటేష్ హీరో అని ప్రచారం జరిగింది. వెంకీ కూడా ఓంకార్తో చర్చలు జరిగినట్లు చెప్పాడు. కానీ ఇప్పుడు సీన్ మారింది. వెంకీ ప్లేస్లోకి నాగార్జున వచ్చాడంటున్నారు. కొన్ని కారణాల వల్ల వెంకీ ఈ సినిమా చేయనని చెప్పేయడంతో నాగార్జునను సంప్రదించాడట ఓంకార్. మనం-ఊపిరి-సోగ్గాడే చిన్ని నాయనా ఇలా మూడు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో మంచి ఊపుమీద ఉన్న కింగ్ నాగార్జున రీసెంట్గా శ్రీకాంత్ తనయుడు రోషన్ డెబ్యూ మూవీ నిర్మలా కాన్వెంట్లో నటించాడు. ఈ సినిమాలో నాగ్ రోల్ మాత్రం కలిసి రాలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓం నమో వెంకటేశాయా అనే భక్తిరస చిత్రంలో నటిస్తున్న నాగ్ ఇప్పుడు హార్రర్ కామెడీ చిత్రానికే ఓటు వేసినట్టు తెలుస్తోంది.
నాగార్జున ఏమిటీ హర్రర్ కామెడీ ఏమిటా అనిపించిందా ..?? అందరికీ అదే అనిపించింది కానీ చంద్రముఖి లాంటి సినిమాతో రజినీ కాంత్ ఏ హిట్ కొట్తాడు కదా అని కొందరంటే, దానికే సీక్వ్ల్ గా వచ్చిన నాగవళ్ళి మన వెంకటేష్ ని ఏం చేసిందిఓ చూసి కూడా నాగ్ ఇలంటి నిర్నయం తీసుకున్నాడా అని ఇంకొందరు అంటున్నారు. మొత్తానికి రియలిటీ షోలనుంచీ దర్శకుడు వరకూ ఎదిగిన ఓంకార్ ఇప్పుడు నాగ్ ని కూడా దైరెక్త్ చేస్తే ఇంక దర్శకుది గా ఒక ఫ్లాట్ఫారం మీదకి ఎక్కేసినట్టే... కానీ నాగ్ కి ఈ సినిమా సూటౌతుందా... అందులోనూ ఒక భయంకరమైన సెంటిమెంత్ రాఘవేంద్రరావు రూపం లో పక్కనే ఉన్న సమయం లో ఇలాంటి హర్రర్ కామెడీ రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాడు ???
హర్రర్ కామెడీ హవా:
ఈ మధ్య బాలీవుడ్ లో బయో పిక్ ఒక ట్రెండ్ గా మారితే.., దక్షిణాదిలో ఇటు తెలుగూ అటు తమిళ్ పరిశ్రమ లో కూడా హర్రర్ కామెడీ హవా సాగుతోంది. మొన్నటి వరకూ కేవలం చిన్న దర్శకులూ, చిన్న హీరోలతో తక్కువ బడ్జెట్ లోనే మినిమం గ్యారెంటీ నుంచీ ఒక మోస్తరు లాభాలను కూడా తెచ్చి పెట్తింది ఈ నవ్వుల దయ్యాలే.... కాండీ అనే జోనర్ ని పిండుకోవాల్సినంత పిండుకున్నారు కనీసం ఒక పదేళ్ళ పాటు కామెడీజోనర్లొ వచ్చిన సినిమాలు చిన్న నిర్మాతల పాలిటి వరంగా మారాయి. అయితే ఇక వరుస కామెడీలకు కొతగా కథలు తగ్గిపోవటం... రొటీన్ కామెడీ ప్రేక్షకులకు బోరు కొట్టట్టటమే కాకుండా...
ఎవర్ గ్రీన్ హిట్ ఫార్ములా ల్లో రెండోదైన:
టీవీల్లోనూ జబర్దస్థ్ లాంటి కామెడీ షోలు కూడా ఒకరకంగా కామెడీ సినిమాల మీద గట్టి దెబ్బే వేసాయి. ఇక దాంతో లాభం లేదనుకుని హిట్ సినిమా స్పూఫ్ లతోనే నవ్వించే ప్రయత్నం చేసి "సుడిగాడు" తో హిట్ కొట్టాడు అల్లరి నరేష్, వెంటనే సంపూర్నేష్ బాబు హీరో గా వచ్చిన సింగం 123 కూడా అదే తరహాలో వచ్చి ప్రేక్షకులని ఆకటుకుంది. అయితే ఈ ట్రెండు కూడా ఎక్కువ కాలం సాగదని "సెల్ఫీ రాజా తో" అర్థమైపోయింది. దాంతో ఇక ఎవర్ గ్రీన్ హిట్ ఫార్ములా ల్లో రెండోదైన హర్రర్ ని ట్రై చేసి చూద్దం అనౌకున్నారు కానీ త్రిపుర లాంటి సినిమాలు ఇచ్చిన అనుభవం తో ఇక అంతకుముందు ఒకటీ రెండుసారి ప్రయోగాత్మకంగా చూసిన హర్రర్ కామెడీ ని పట్టుకున్నారు.
ఓంకారన్నయ్య డైరెక్షన్ లో:
ప్రేమ కథా చిత్రం నుంచీ ఈ హర్రర్ కామెడీ హవా మొదలై... నెమ్మది నెమ్మది గా తన సత్తా నిరూపించుకుంది. ఇప్పుడు ప్రభుదేవా.., తమన్నా లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న నటులు కూడా ఈ జోనర్ లోకి అడుగు పెడుతున్నారు. ఇప్పుడు మరో అడుగుముందుకేసి అగ్ర హీరోల్లో ఒకడైన నాగార్జున కూడా ఒక హర్రర్ కమెడీలో నటించనున్నాడట. అదీ ఓకారన్నయ్య డైరెక్షన్ లో...
ముందు విక్టరీ వెంకటేష్ హీరో అని ప్రచారం:
ఓం కార్ ఇదివరకే తీసిన రాజు గారి గది కి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నడన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ముందు విక్టరీ వెంకటేష్ హీరో అని ప్రచారం జరిగింది. వెంకీ కూడా ఓంకార్తో చర్చలు జరిగినట్లు చెప్పాడు. కానీ ఇప్పుడు సీన్ మారింది. వెంకీ ప్లేస్లోకి నాగార్జున వచ్చాడంటున్నారు. కొన్ని కారణాల వల్ల వెంకీ ఈ సినిమా చేయనని చెప్పేయడంతో నాగార్జునను సంప్రదించాడట ఓంకార్.
"రాజు గారి గది'కి సీక్వెల్:
పీవీపీ లాంటి పెద్ద సంస్థ ఓంకార్తో సినిమాకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆల్రెడీ పీవీపీ బేనర్లో ‘ఊపిరి' లాంటి సినిమా చేసిన నాగ్.. ఓంకార్ స్క్రిప్టు మీద ఆసక్తిగానే ఉన్నాడట. ఐతే ఇంకొంచెం వర్క్ చేయమని చెప్పాడట. త్వరలోనే ఓంకార్-నాగ్ కాంబినేషన్లో సినిమా మొదలు కావచ్చని సమాచారం. ‘రాజు గారి గది'కి సీక్వెల్ అన్నప్పటికీ కథ పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఓంకార్ లాంటి దర్శకుడు నాగార్జునను డైరెక్ట్ చేయడమంటే మామూలు విషయం కాదు. అందులోనూ పీవీపీ బేనర్ ఈ చిత్రాన్ని నిర్మించడం మరింత పెద్ద విశేషమే.
"చంద్రముఖి" ఉంది కదా:
అయితే హర్రర్ కామెడీ అనే జోనర్ నాగ్ లాంటి హీరోకి సూటవుతుందా అన్నదే ఇప్పుడున్న ప్రశ్న. అయితే రజినీ కాంత్ లాంటి సూపర్ స్టార్ చేసిన "చంద్రముఖి" ఉంది కదా అనిపించినా... దాని తర్వాత మన తెలుగు స్టార్ విక్టరీ కి అపజయం తెచ్చిన "నాగవళ్ళిని" కూడా చూడాలి. అందులోనూ ఇక్కడ దర్శకుడు "ఓంకారన్నియ్య" అన్న బేసిక్ విశయాన్ని కూడా మనం గమనించాలి కదా... ఇక ఇక్కడ ఇంకా ముఖ్యంగా పట్టించుకోవాల్సిన విశయం ఒకటుంది.
భక్తి సినిమా సూపర్ హిట్:
అదేమిటంటే నాగ్-రాగ్-ఆఫ్టర్ ఏ ఫ్లాప్ అని.., ఈ ఫార్ములా ప్రకారం నాగార్జున, రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వచ్చిన భక్తి సినిమా సూపర్ హిట్ అవుతుంది ఆ తర్వాత వెంటనే వచ్చిన హీరో సినిమా అట్టర్ గా ఫట్ అవుతుంది.. అన్నమయ్య సినిమా బంపర్ హిట్ ఆ వెంతనే వచ్చిన "చంద్ర లేఖ" "ఆటో డ్రైవర్" అసలు నాగార్జున ఈ సినిమా తీసాడాలేదా అనే డౌటొచ్చెంత పెద్ద ఫ్లాప్, ఇక ఆతర్వాత శ్రీ రామదాసు మళ్ళీ రాఘ వేంద్రుడే... ఆ తర్వాత వచ్చిన "బాస్ ఐలవ్ యూ మళ్ళీ దేబ్బేసింది. ఇక శిరిడీ సాయి తర్వాత వచ్చిన ఢమరుకం, గ్రీకు వీరుడు ఎమయ్యాయో మళ్ళీ చెప్పాలా??
రాజు గారి రెండో గదే....
ఈ ఫార్ములా నాగ్ మీద మాత్రమే కాదు శ్రీ మంజునాథ తర్వాత "అంజి" తో చిరంజీవికీ, పాండురంగడు తర్వాత "మిత్రుడు" లతో బాలయ్యకీ ఇదే అనుభవం ఎదురయ్యింది. ఇదే ఫార్ములాని బట్టి చూస్తే సేం నాగ్,-రాగ్ కాంబినేషన్ లో రాబోతున్న ఓం నమో వేంకటేశాయ తర్వాత చేయ బోయే సినిమా... ఈ రాజు గారి రెండో గదే.... మరి అటు ఓం కారన్నయ్య ఒకసరి హిట్ అయిన సబ్జెక్ట్ అంటూ ఆశపెడుతున్నా అసలే రాఘవేంద్ర రావు సినిమా తో వచ్చిన దిష్టి మొత్తం ఈ సినిమాతో పోయినట్టవుతుందనుకుంటున్నాడా నాగార్జున??