Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రూ. కోటి విరాళం ప్రకటించిన మరో మనసున్న స్టార్
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సంపాదనలో మాత్రమే కాదు.... సహాయం చేయడంలోనూ తాను స్టారే అని నిరూపించుకున్నాడు. భారీ వరదలతో అతలాకుతలం అయిన చెన్నై నగరంలోని బాధితుల కోసం ఆయన రూ. 1 కోటి విరాళం అందించారు. చెన్నై బాధితులకు సహాయం చేయడంలో ముందున్న భూమిక ట్రస్ట్ కు ఆయన రూ. 1 కోటి విరాళం అందించారు.
చెన్నై నగరంపై విరుచుకుపడ్డ ప్రకృతి విళయం చూసి షాకైన అక్షయ్ కుమార్.... సహాయం అందించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే తనకు సన్నిహితుడైన సౌత్ డైరెక్టర్ ప్రియదర్శన్కు కాల్ చేసాడు. ఆయన ఈ వ్యవహారం విషయంలో నటి సుహాసిని మణిరత్నంను సంప్రదించాలని సూచించారు.
సుహాసిని మణిరత్నం సలహా మేరకు ‘భూమిక ట్రస్ట్'కు రూ. 1 కోటి సహాయం అందించారు. చెన్నైలో ప్రకృతి విలయం సంప్రదించిన మరుసటి రోజు నుండి ఈ ట్రస్ట్ వరద బాధితులకు ఆహారం అందించడంతో పాటు అన్ని విధాలుగా సహాయం చేస్తోంది. అక్షయ్ కుమార్ పంపిన చెక్కును సుహాసిన మణిరత్నం... భూమిక ట్రస్ట్ మేజింగ్ ట్రస్టీ జయేంద్రకు అందజేసారు.