Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తెలుగు టైటన్స్ బ్రాండ్ అంబాసిడర్గా అల్లు అర్జున్
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ కబడ్డీ ఫ్రాంచైజీ ‘తెలుగు టైటన్స్' బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నరు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్న ప్రో కబడ్డీ లీగ్(పికెఎల్)లో హైదరాబాద్ ఫ్రాంచైజీ ‘తెలుగు టైటన్స్'కూడా ఒకటి. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ రోజు నుండి పికెఎల్ ప్రారంభం కానుంది.
ప్రో కబడ్డీ లీగ్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఇందుకు సంబంధించిన వ్యవహారాలు వెల్లడించింది. అల్లు అర్జున్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ లీగ్ లో మొత్తం 8 టీమ్స్ తలపడుతున్నాయి. క్రికెట్ ఐపీఎల్ టి20 తరహాలోనే.... పికెఎల్ నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్నది పికఎల్ రెండో సీజన్ టోర్నమెంట్.
అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే...తన తర్వాతి సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాకి ఇద్దరమ్మాయిలతొ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ ని కంపోజ్ చేసిన కెచ్చాను తీసుకున్నట్టు సమాచారం. కెచ్చా..ధాయిలాండ్ కు చెందిన ఫైట్ మాస్టర్.
అన్నపూర్ణ స్టూడియోస్లో ఫైట్ షూటింగ్ తో ప్రారంభమైనట్లు సమాచారం. ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కనపడనుంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.