Don't Miss!
- News రేపు కామద ఏకాదశి.. ఈ రాశులు పట్టుకుందల్లా బంగారమే
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Finance EPFO News: ఉద్యోగులకు గుడ్న్యూస్.. మారిన పీఎఫ్ విత్డ్రా రూల్స్.. ఎంతంటే..??
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
అల్లు అర్జున్ 'సన్నాఫ్ సత్యమూర్తి' ఉగాది విషెష్ (పోస్టర్ )
హైదరాబాద్ :అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం 'సన్నాఫ్ సత్యమూర్తి'. త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. సమంత, నిత్య మేనన్, అదా శర్మ హీరోయిన్స్. రాధాకృష్ణ నిర్మాత. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఉదాగిని పురస్కరించుకుని నిర్మాతలు శుభాకాంక్షలు తెలియచేస్తూ పోస్టర్ ని విడుదల చేసారు. ఆ పోస్టర్ ని మీరు ఇక్కడ చూస్తున్నది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ''జులాయి' కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రమిది. ఆ సినిమా ఘన విజయం సాధించింది. 'సన్నాఫ్ సత్యమూర్తి' దానికి నాలుగు రెట్లు విజయం సాధిస్తుంది''అన్నారు.
సమంత చెబుతూ ''ఒక అందమైన కుటుంబ కథా చిత్రమిది. అల్లు అర్జున్తో తొలిసారి నటించాను. హార్డ్వర్క్ అనే పదానికి నిర్వచనం ఆయన'' అంది. ఉపేంద్ర మాట్లాడుతూ ''చాలా కాలం తరవాత మళ్లీ తెలుగులో నటించా. చాలా మంచి పాత్ర దక్కింది. బన్నీ సినిమాలన్నీ చూస్తూ ఉంటా. తనదైన స్త్టెల్తో దక్షిణాదిన మంచి పేరు తెచ్చుకొన్నాడ''న్నారు.
''నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో ఓ మంచి సినిమా తీశాం. అడగ్గానే ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకొన్న ఉపేంద్రగారికి ధన్యవాదాలు'' అన్నారు త్రివిక్రమ్.
అల్లు అర్జున్ మాట్లాడుతూ ''ఈ చిత్రానికి పనిచేసిన వాళ్లందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. కంటెంట్ ఉన్నవాడికి కటౌట్తో పనిలేదు.. అని హరీష్ శంకర్ ఓ డైలాగ్ రాశాడు. త్రివిక్రమ్ గారిని చూస్తే అదే గుర్తొస్తుంది. మేటర్ ఉన్నవాడికి మ్యాజిక్తో పని లేదు. ఈ సినిమాలోనూ మంచి సంభాషణలున్నాయ''న్నారు.
సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ, ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.