Don't Miss!
- News పవన్ అప్పుల చిట్టా రూ. 46,70,00,000: `వదిన` దగ్గర పర్సనల్ లోన్
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఉండాల్సింది బ్రాండ్ కాదు దమ్ము: అల్లు అర్జున్ , ఎవరికీ సెటైర్
హైదరాబాద్ :'ఎదుటోళ్లుతో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు.. ఇక్కడ దమ్ము..టన్నులు టన్నులు ఉంది ఇంకా' అంటూ వస్తున్నాడు 'సరైనోడు'. అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రమిది.
రకుల్ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్స్. బోయపాటి శ్రీను దర్శకుడు. అల్లు అరవింద్ నిర్మాత. తమన్ స్వరాలందించారు. ఈ చిత్రం పాటల విజయోత్సవం వైజాగ్ లో జరిగింది. ఈ సందర్బంగా ధియేటర్ ట్రైలర్ ని విడుదల చేసారు. అందులో ఈ డైలాగు హైలెట్ గా ఉంది.
అల్లు అర్జున్ మాట్లాడుతూ ''తమన్ ఎంత సాలిడ్గా ఉంటాడో పాటలు అంతే. ఈ సినిమాకు సరైన పాటలు అందించిన సరైనోడు తమన్. 'ఆర్య' సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ఆర్.కె.బీచ్ దగ్గర నా సినిమా పాటల వేడుకో లేదంటే ఇంకేదైనా కార్యక్రమమో జరగాలనుకున్నాను.
ఈ సినిమాతో అది సాధించాను. నేను, ఆది కలసి చిన్నతనంలో కరాటే శిక్షణ తీసుకున్నాం. అలాంటి ఆదితో ఇప్పుడు సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఒకవేళ ఈ సినిమా ఇతర భాషలో ఎవరైనా చేస్తే నేను ఆది పాత్ర చేస్తా. అంతగా నచ్చిందా పాత్ర.
బోయపాటి శ్రీను హీరోను బట్టి సినిమాలు డిజైన్ చేస్తారు. ఈ సినిమా విడుదలయ్యాక ఆయన కేవలం మాస్ డైరక్టరే కాదు అన్ని రకాల సినిమాలూ చేయగలరని మరోసారి తెలుస్తుంది.
ఈ రోజు నేనిలా ప్రేక్షకుల ముందు నిలబడ్డాను అంటే అది చిరంజీవిగారి వల్లే. నేనే కాదు పవన్ కల్యాణ్, రామ్చరణ్, శిరీష్, సాయిధరమ్తేజ్... ఇలా మా కుటుంబం ఎవరు వచ్చినా అది చిరంజీవిగారు వేసిన దారి వల్లే. ఆయన లేకపోతే మేం లేం'' అన్నారు.