Don't Miss!
- News ఊపిరి పీల్చుకున్న ఉద్యాననగరి..!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
సాఫ్ట్వేర్ భర్తకు హీరోయిన్ విడాకులు: దర్శకుడితో రెండో పెళ్లి!
కొచ్చి: మళయాలం హీరోయిన్ జోతిర్మయి రెండో వివాహం చేసుకుంది. గత కొంతకాలంగా మళయాల దర్శకుడు అమల్ నీరద్తో సన్నిహితంగా ఉంటున్న ఆమె అతన్ని వివాహమాడటం ద్వారా తన తదుపరి జీవితాన్ని అతనితో గడపబోతోంది. దర్శకుడు అమల్ నివాసంలో ఈ వివాహం చాలా సింపుల్గా జరిగింది. క్లోజ్ ఫ్రెండ్ష్ సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
అమల్ నీరద్, జోతిర్మయి వివాహ వార్త అటు సినీ రంగాన్ని, ఇటు అభిమాన లోకాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. పెళ్లి జరిగే వరకు వీరిద్దరు తమ సంబంధాన్ని గోప్యంగా మెయింటేన్ చేయడం గమనార్హం. మీడియా వారు కూడా తమ మధ్య ఇంత కాలం సాగిన ప్రేమ బంధాన్ని కనిపెట్టకుండా జాగ్రత్త పడ్డారు.
వారి సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.....అమల్ నీరద్ దర్శకత్వంలో వచ్చిన ‘సాగర్ అలియాస్ జాకీ రీ లోడెడ్' సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ చిత్రంలో జోతిర్మయి ఐటం సాంగ్ చేసింది. పెళ్లి తర్వాత అమల్ నీరద్ తమ పెళ్లి ఫోటోను ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసాడు.
జోతిర్మయి మొదటి వివాహం తన చిన్ననాటి స్నేహితుడు, ఐటి ప్రొఫెషనల్ అయిన నిశాంత్ తో జరిగింది. అయితే ఇద్దరి మధ్య పొసగక పోవడం, కాపురంలో విబేధాల కారణంగా 7 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం 2011లో విడాకులు తీసుకున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న జోత్మిర్మయి 2013 నుండి లైమ్ లైట్లో ఉండటం లేదు. ఆమె చివరగా నటించిన మళయాల చిత్రం ‘హౌస్ ఫుల్'.