Don't Miss!
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
తుపాకీ తూటాల పేలుళ్ళ మధ్య...
గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అనురాధ ఫిలింస్ డివిజన్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం రోజ్ గార్డెన్. ప్రస్తుతం ఈ చిత్రంతో కాశ్మీర్లో చిత్రీకరణను జరుపుకుంటుంది. చదలవాడ తిరుపతిరావు సమర్పణలో చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ల మధ్య యుద్ద వాతావరణం కలిగి ఉంది. కాశ్మీర్లో అడుగుపెట్టడానికే భయం నెలకొన్న సమయంలో ధైర్యంగా, సాహసంగా ఈ చిత్రం పూర్తిగా కాశ్మీర్లోనే చిత్రీకరణ జరుపుకోవటం విశేషం.
దర్శకుడు జి.రవికుమార్(బాంబే రవి) మాట్లాడుతూ... కాశ్మీర్ మొత్తం అల్లకల్లోలంగా ఉన్న సమయంలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాత్రమే సాహసంతో ఈ చిత్రాన్ని కాశ్మీర్లో నిర్మిస్తుండటం విశేషం. అలాగే కాశ్మీర్ ప్రభుత్వంతో నిర్మాతలకు ఉన్న అనుబంధం కారణంతో దాదాపు 120 మంది యూనిట్ సభ్యులతో షూటింగ్ చేస్తున్నాం. కాశ్మీర్ ప్రభుత్వం సహకారంతో ప్రభుత్వం అందిస్తున్న భారీ భద్రత మధ్య సహకారంతో ఏ టెన్షన్ లేకుండా చిత్రీకరణ జరుగుతుంది. ఈ చిత్రీకరణలో సైన్యానికి చెందిన ఆయుధాలనే ఉపయోగిస్తున్నట్టు చెప్పారు.