Don't Miss!
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శవంతోనూ సెల్ఫీలు... ఫీలైన మెగా స్టార్
ముంబై : ''మరణించినవారికీ మర్యాద ఇవ్వడం లేదు.. వాళ్ల అంత్య క్రియలను దగ్గరుండి చేయడానికి హాజరయ్యే బతికున్నవాళ్లకీ మర్యాద లేదు. సమయం, సందర్భం కూడా పట్టించుకోకుండా సెల్ఫీల కోసం ఎగబడటం దారుణం'' అని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఈ మాటలను సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా పంచుకున్నారు. ఆయన ఏమన్నారో చూడండి.
FB 1008 - My dear friend passed away suddenly .. was chatting and suddenly gone !! Fragility of life ..Went for the...
Posted by Amitabh Bachchan on 3 July 2015
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
అమితాబ్ ఇలా ఆవేదన చెందటానికి కారణం రీసెంట్ గా జరిగిన సంఘటనే. ఇటీవల స్నేహితుడు చనిపోతే, అంతిమక్రియల్లో పాలుపంచుకోవడానికి అమితాబ్ ఢిల్లీ వెళ్లారు.ఇది హఠాన్మరణం అని, అస్సలు ఊహించలేదని ఈ సందర్భంగా బిగ్ బి పేర్కొన్నారు.
అయితే స్నేహితుడు చనిపోయిన బాధలో ఉన్న ఆయన్ను మరో విషయం విపరీతంగా బాధపెట్టింది. అంతిమక్రియల్లో పాలుపంచుకోవడానికి వెళ్లిన అమితాబ్తో సెల్ఫీలు దిగడానికి చాలామంది ఎగబడటమే బాధించిందని అన్నారు.
ఇక రీసెంట్ గా...
బాలీవుడ్ ప్రముఖుడు, బిగ్ బి అమితాబ్ ‘బాహుబలి' చిత్రంపై ప్రశంసలు గుప్పించడంపై దర్శకుడు రాజమౌళి ఆనందం వ్యక్తం చేసాడు. ఆయనకు థాంక్స్ చెప్పారు. అమితాబ్ బచ్చన్జీకి పెద్ద థాంక్స్. ఆయన నుండి అలాంటి పొగడ్తలు వినడంతో బాహుబలి టీం ఇంకా షాక్లో ఉంది. మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసే విధంగా ఆయన మాట్లాడారు అని రాజమౌళి చెప్పుకొచ్చారు.
అమితాబ్ ఏమన్నారంటే... ‘బాహుబలి' తెలుగు సినిమా ఏమాత్రం కాదు, ఇది ప్రపంచ స్థాయి సినిమా అని అమితాబ్ బచ్చన్ ప్రశంసించారు. ఇండియన్ స్క్రీన్పై ఇలాంటి విజువల్స్ తానెపుడూ చూడలేదని, ఇలాంటి సినిమాలో తనకు అవకాశం రాకపోవడం చాలా బాధగా ఉందని అన్నారు. ఈ సినిమాను భారత ప్రజలందరూ చూసి ఎంజాయ్ చేయాలని కూడా సూచించారు.