Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రక్తానికి రక్తం: అమితాబ్కి యూఎస్ కోర్టు నోటీసులు
హైదరాబాద్: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఫెడరల్ కోర్టు నోటీసులు జారీచేసింది. 1984 అల్లర్ల కేసులో అమితాబ్ బచ్చన్ పై ఆరోపణలు రావడంతో లాస్ ఏంజిల్స్ ఫెడరల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని అమితాబ్ బచ్చన్ పై ఆరోపణలు వెలువడ్డాయి.
'బ్లడ్ ఫర్ బ్లడ్ ' నినాదాలు చేశారని అమితాబ్ పై అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే సిక్కుల ఫిర్యాదుతో అమితాబ్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. ‘రక్తానికి రక్తం' అంటూ నాడు అమితాబ్ బచ్చన్, సిక్కుల ఊచకోతను సమర్థించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
దీనిపై ‘సిక్స్ ఫర్ జస్టిస్' అనే అమెరికా మానవ హక్కుల సంస్థ సభ్యుడు గురు పత్వంత్ పన్నున్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా లాస్ ఏంజెలిస్ కోర్టు తాజాగా ఈ సమన్లు జారీ చేసింది. ఈ సమన్లకు జవాబిచ్చేందుకు కోర్టు, అమితాబ్ బచ్చన్ కు 21 రోజుల గడువిచ్చింది. నాటి అమితాబ్ వ్యాఖ్యలు అల్లర్లకు ఆజ్యం పోశాయని సిక్కులు ఆరోపిస్తున్నారు.