twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రక్తానికి రక్తం: అమితాబ్‌కి యూఎస్ కోర్టు నోటీసులు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఫెడరల్ కోర్టు నోటీసులు జారీచేసింది. 1984 అల్లర్ల కేసులో అమితాబ్ బచ్చన్ పై ఆరోపణలు రావడంతో లాస్ ఏంజిల్స్ ఫెడరల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని అమితాబ్ బచ్చన్ పై ఆరోపణలు వెలువడ్డాయి.

    'బ్లడ్ ఫర్ బ్లడ్ ' నినాదాలు చేశారని అమితాబ్ పై అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే సిక్కుల ఫిర్యాదుతో అమితాబ్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. ‘రక్తానికి రక్తం' అంటూ నాడు అమితాబ్ బచ్చన్, సిక్కుల ఊచకోతను సమర్థించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

    Amitabh Bachchan summoned by US court over 1984 anti-Sikh riots

    దీనిపై ‘సిక్స్ ఫర్ జస్టిస్' అనే అమెరికా మానవ హక్కుల సంస్థ సభ్యుడు గురు పత్వంత్ పన్నున్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా లాస్ ఏంజెలిస్ కోర్టు తాజాగా ఈ సమన్లు జారీ చేసింది. ఈ సమన్లకు జవాబిచ్చేందుకు కోర్టు, అమితాబ్ బచ్చన్ కు 21 రోజుల గడువిచ్చింది. నాటి అమితాబ్ వ్యాఖ్యలు అల్లర్లకు ఆజ్యం పోశాయని సిక్కులు ఆరోపిస్తున్నారు.

    English summary
    Bollywood megastar Amitabh Bachchan was summoned by the federal court of Los Angeles in the United States on Tuesday for allegedly instigating violence against the Sikh community in 1984, according to TV reports.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X