Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ క్షణం..అనసూయ ఇలా...(ఫొటో)
హైదరాబాద్ :అనసూయ, ఆదా శర్మ, అడవి శేషు మరియు సత్య దేవ్ కలిసి నటించిన థ్రిల్లర్ 'క్షణం'. ఈ సినిమాకు సంబందించి ఫస్ట్ లుక్ విడుదలైంది. దానిని అనసూయ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఆ ఫోస్ట్ ఇక్కడ చూడండి.
And so!! This is how v look!! Woot!! 🤓 #Kshanam #FirstPosters
Posted by Anasuya Bharadwaj on 3 February 2016
అడవి శేష్, అదా శర్మ, అనసూయ భరద్వాజ, సత్యదేవ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘క్షణం'. రవికాంత్ పేరెపు దర్శకుడు. పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. హైదరాబాద్లో బుధవారం ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘‘నేనూ, అడవి శేష్ కలిసి ఈ కథ తయారు చేశాం. పీవీపీ సంస్థకు నచ్చడంతో దర్శకుడిగా తొలి అవకాశం దక్కింది. కనిపించకుండా పోయిన ఓ మూడేళ్ల బాలికను కొందరు వెదికే నేపథ్యంలో ఏ క్షణం ఏం జరుగుతుందనే ఆసక్తిని కలిగిస్తూ తెరకెక్కించిన చిత్రమిది. యాక్షన్, వినోదం మేళవించాం. మూడు పాటలున్నాయి. శ్రీచరణ్ సంగీతం ఆకట్టుకొంటుంది''అన్నారు.
పరమ్ వి. పొట్లూరి మాట్లాడుతూ ‘‘ట్వంటియత్ సెంచరీ, బ్లూ ఫాక్స్, పారామౌంట్ సంస్థల్లా ప్రేక్షకులు కలకాలం గుర్తుంచుకొనే చిత్రాల్ని నిర్మించాలన్నది పీవీపీ సంస్థ ఉద్దేశం. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతికనిపుణుల సమష్టి కృషితో తెరకెక్కింది. మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది'' అన్నారు.
అడవి శేష్ చెబుతూ ‘‘నా జీవితంలో ఎదురైన ఓ సంఘటన ఆధారంగా ఈ కథని తయారు చేశాం. తెరపై కనిపించే ప్రతి పాత్ర విభిన్నంగా సాగేదే'' అన్నారు.
పోలీస్ పాత్ర లో నటించానని అనసూయ చెప్పింది. ఈ కార్యక్రమంలో సత్యదేవ్, శ్రీచరణ్ , షనిల్ డియో పాల్గొన్నారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కూర్పు: అర్జున్ శాస్త్రి, రవికాంత్ పేరెపు