Don't Miss!
- News సీఎం పదవి ఊడిపోతుంది, మేము కొట్లాడుకుంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈగనోడి !
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
నాగార్జున మరదలిగా యాంకర్ అనసూయ?
హైదరాబాద్: ‘మనం' ఘనవిజయం తర్వాత అక్కినేని నాగార్జున నటిస్తున్న కొత్త చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా'. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి (‘అందాల రాక్షసి' ఫేం) కథానాయికలుగా నటిస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంతో కల్యాణ్కృష్ణ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘మనం' చిత్రానికి పనిచేసిన ఛాయాగ్రాహకుడు పి.ఎస్.వినోద్ ఈ సినిమాకీ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున మరదలి పాత్రలో హాట్ యాంకర్ అనసూయ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమాలో నాగార్జున, అనసూయల మధ్య బావా మరదళ్ల సరసాలు, రొమాంటిక్ సీన్లు ఉంటాయని టాక్. నాగార్జునతో కలిసి ఓ పాటలో ఆమె డాన్స్ కూడా చేస్తుందట. హాట్ అండ్ సెక్సీ లేడీ, ఐటం గర్ల్ హంసా నందిని కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో నాగ్ రెండు పాత్రలు చేయనున్నారు. సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుందని అంటున్నారు. యాంకర్ అనసూయ బుల్లి తెర ప్రేక్షకులు సుపరిచితం. ఆమె పాత్ర కూడా సినిమాకు ప్లస్సయ్యేలా ఉంటుందని అంటున్నారు.