Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
హింసించారు...బాహుబలి-2 దర్శక నిర్మాతలను అరెస్టు చేయండి!
హైదరాబాద్: బాహుబలి-2 షూటింగ్ లో ఏనుగులను హింసించారని, వాటిని ఇబ్బంది పెట్టారని....ఈ పరిణామాలకు కారణమైన బాహుబలి చిత్ర దర్శక నిర్మాతల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జంతు హక్కుల పరిరక్షణ కార్యకర్తల నుండి డిమాండ్లు మొదలయ్యాయి.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి-2' షూటింగ్ ఇటీవల కేరళలోని త్రిసూరులో జరిగింది. ఈ సినిమాలో షూటింగులో ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ఏనుగులను షూటింగు కోసం వినియోగించారని, వన్యమృగాల చట్టం-2001లోని నిబంధనలను యదేశ్చగా ఉల్లంగించారని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని యానిమల్ టాస్క్ ఫోర్స్ బృందం డిమాండ్ చేసింది. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని ప్రధానికి కార్యాలయానికి లేఖ రాసారు.
ఏనుగులను కేవలం గ్రాఫిక్స్ చేసి సినిమాలో చూపించేందుకే వాడామని చిత్ర బృందం చెబుతున్నప్పటికీ షూటింగ్.... షూటింగ్ జరుగుతున్నంత సేపు అక్కడి పరిస్థితులు, షూటింగులోని ఉన్న జనం అరుపుల కారణం ఏనుగు ఇబ్బంది పడిందని యానిమల్ టాస్క్ ఫోర్స్ సెక్రటరీ వీకె వెంకటాచలం ఆరోపించారు.
ఇక ఈ చిత్రం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. రెండో భాగానికి ''బాహుబలి - ది కంక్లూజన్' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.