Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మెగాస్టార్ సినిమాలో వేశ్యగా హీరోయిన్ అంజలి
హైదరాబాద్: హీరోయిన్ అంజలి ప్రస్తుతం బాలయ్యతో ‘డిక్టేటర్' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో అంజలి నటించిన భారీ ప్రాజెక్టులలో ఇదీ ఒకటి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.... అంజలి మరో భారీ ప్రాజెక్టు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
మళయాలం మెగాస్టార్ మమ్ముట్టి నటించిన సినిమాలో ఆయనకు జోడీగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మమ్ముట్టి కోలీవుడ్లో నటిస్తున్న రీఎంట్రీ మూవీలో ఆమె నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ‘పెరంబు' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రామ్ దర్శకత్వం వహించబోతున్నారు.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి ట్రాన్స్ జెండర్గా, వేశ్యగా కనిపించబోతోందట. ఈ చిత్రం జనవరి 6వ తేదీన ప్రారంభోత్సవం జరుపుకోబోతోందని సమాచారం. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
ఈ సినిమాలతో పాటు అంజలి ‘సరైనోడు' మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తోంది. దీంతో పాటు ఓంకార్ దర్శకత్వంలో ‘రాజుగారి గది' సీక్వెల్ మూవీ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది.