Don't Miss!
- News వాట్సప్ లో మరో అదిరిపోయే కొత్త ఫీచర్; ఆఫ్ లైన్ లోనూ షేరింగ్.. ఇక రచ్చేనా!!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బాహుబలి రేంజిలో: ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ యుద్ధ సీన్లకు 8 కోట్లు!
హైదరాబాద్: నందమూరి నటసింహం బాలయ్య త్వరలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్లోనే ఈ చిత్రం భారీ బడ్జెట్ సినిమా కాబోతోంది. చారిత్రక నేపథ్యం ఉన్న స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటి వరకు టాలీవుడ్లో భారీ సినిమా అంటే 'బాహుబలి' మాత్రమే. ఈ చిత్రంలో చూసిన యుద్ధ సన్నివేశాలు ఇప్పటి వరకు మనం ఏ తెలుగు సినిమాలోనూ చూడలేదు. ఇలాంటి సీన్లు చూసిన ప్రేక్షకులను మెప్పించాలంటే ఆ రేంజికి తగ్గకుండా 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో యుద్ధ సన్నివేశాలు ఉండాలని దర్శకుడు క్రిష్ భావిస్తున్నారు.
యుద్ధ సన్నీవేశఆలకు సంబంధించిన షెడ్యూల్ 24 రోజులపాటు మొరాకోలో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో దాదాపు 800 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటారని తెలుస్తోంది. ఎనిమిది కోట్లు ఖర్చుతో భారీ స్థాయిలో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. యుద్ధానికి అవసరమైన ఆయుధాలను దాదాపు నాలుగు టన్నుల మెటీరియల్ తో తయారు చేయించారట.
సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా ప్రముఖ పాత్ర పోషించనున్నాయి. ఇందుకోసం 'బాహుబలి' సినిమాకు విజువల్ ఎపెక్ట్స్ అందించిన 'మకుట' సంస్థను దర్శకుడు సంప్రదించినట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయేలా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా క్రిష్ భావిస్తున్నారు. అందుకు తగిన విధంగా సినిమా చిత్రీకరణ ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మే 9 నుంచి ఈ సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇందులో బాలయ్య తల్లి పాత్రలో బాలీవుడ్ నటి హేమా మాలిని తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ఇంకా అఫీషియల్ గా కరారు కావాల్సి ఉంది. అదే విధంగా బాలీవుడ్ నటుడు కబీర్ బేడి కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఈ నెల 9 నుండి మోరాకో షెడ్యూల్ ప్రారంభం అవుతుందని, 2 నుండి 3 వారాలు ఇక్కడ మేజర్ వార్ సీక్వెన్స్ మొదలవుతుందని నిర్మాత రాజీవ్ తెలిపారు. మొరాకో షెడ్యూల్ పూర్తయిన తర్వాత సినిమా టీం తిరిగి ఇండియా వస్తామని తెలిపారు. ఈ సినిమాకు హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. నయనతారను సంప్రదించాం. ఆమెకు ఇంట్రెస్టు ఉన్నా సెప్టెంబర్ వరకు ఆమె డేట్స్ ఖాళీ లేవు. అప్పటి వరకు మేము ఆగదలుచుకోలేదు. మూడో షెడ్యూల్ నుండి హీరోయిన్ అవసరం ఉంటుంది. త్వరలోనే ఎవరో ఒకరిని ఖరారు చేస్తాం అని రాజీవ్ తెలిపారు.