Don't Miss!
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- News తనపై ఉన్న కేసుల వివరాలను వెల్లడించిన సీఎం జగన్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ విషయం 'బాహుబలి' చూస్తే అర్థమవుతుంది: అనుష్క
హైదరాబాద్ : ప్రభాస్తో నేను చేసిన మూడో చిత్రం 'బాహుబలి'. మా ఇద్దరి మధ్య ఎంత అవగాహన ఉంటుందో, మేం సెట్లో ఒకరికొకరు ఎలా సహకరించుకొంటామో, ఆ ఫలితం ఎలా ఉంటుందో 'బాహుబలి' చూస్తే అర్థమవుతుంది అంటూ చెప్పుకొచ్చింది అనుష్క.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
అలాగే...రాజమౌళిగారితో రెండో సినిమా చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ సినిమా చేయడానికి కారణం ఒకటి రాజమౌళిగారైతే మరొకటి 'బాహుబలి' స్క్రిప్టు అన్నారామె. 'రుద్రమదేవి'లో రాణి రుద్రమగా నటించడంతో పాటు... త్వరలోనే 'బాహుబలి' చిత్రంతో దేవసేనగా ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. ఈ సందర్భంగా అనుష్క మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.
అలాగే...''ఈమధ్య చాలా మంది నన్నొక ప్రశ్న అడుగుతున్నారు. అరుంధతి, రుద్రమదేవి, దేవసేన... ఈ మూడు పాత్రల్లో మీకు ఏది ఎక్కువగా ఇష్టం అని ప్రశ్నిస్తున్నారు. నేనైతే మొదటిదే అని చెబుతాను. ఎందుకంటే ఆ సమయంలో నాకు ఏమీ తెలియదు. అంత క్లిష్టతరమైన పాత్రని ధైర్యంగా చేసి ప్రేక్షకుల్ని మెప్పించగలిగాను. అందుకే ఆ సినిమా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది'' అంటూ చెప్పిందామె.
బాహుబలి విషయానికి వస్తే...
బాహుబలిని ఆర్కా మీడియా సంస్థ నిర్మించింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులు. ప్రస్తుతం యావత్ భారతదేశ సినీ పరిశ్రమ కళ్ళన్నీ బాహుబలి చిత్రం వైపే వున్నాయి. ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.
ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు. ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. బాహుబలి పార్ట్ 1 జులై 10న మనముందుకు రానుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తుంది.
భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రభాస్ హీరోగా నటించారు. అనుష్క, తమన్నాహీరోయిన్స్. రానా విలన్ గా కనిపిస్తారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. కీరవాణి సంగీతం అందించారు.