Don't Miss!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అల్లు శిరీష్ - పరుశరామ్ చిత్రం టైటిల్ ఏంటి?
హైదారాబాద్ : అల్లు శిరీష్, పరుశరామ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం ఈ రోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘మేరీ జాన్ ' అనే టైటిల్ ని పరిశీలుస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ టైటిల్ కు అల్లు శిరీష్, అల్లు అరవింద్ ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పుకున్నారు.
మెగా కుటుంబం నుంచి మరో హీరో అల్లు శిరీష్. అల్లు అరవింద్ కుమారుడు, అల్లు అర్జున్ సోదరుడు అయిన అల్లు శిరీష్ కు తొలి చిత్రం సమయంలో మంచి క్రేజే వచ్చింది. అయితే ఆ చిత్రం డిజాస్టర్ ఫ్లాఫ్ అవటం అతన్ని ఇబ్బంది పెట్టింది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
‘గౌరవం' సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన మరో హీరో అల్లు శిరీష్. ఆ తర్వాత ‘కొత్త జంట' సినిమాతో మెగా ఫ్యామిలీ హీరోల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కొత్త జంట' తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న శిరీష్, తాజాగా ఈరోజే మరో కొత్త సినిమాను మొదలుపెట్టేశారు.
‘యువత', ‘ఆంజనేయులు', ‘సోలో' సినిమాలతో మెప్పించిన పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘సారొచ్చారు' తర్వాత పరశురామ్ దర్శకత్వంలో రానున్న సినిమా ఇదే కావటం విశేషం. రామ్ తో అనుకున్నా వర్కవుట్ కాకపోవటంతో ఇప్పుడు అల్లు శిరీష్ తో ముందుకు వెళ్తున్నారు.
ఈ ఉదయం అల్లు శిరీష్ కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఓ మంచి లవ్స్టోరీతో పాటు, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని శిరీష్ ఈ సందర్భంగా తెలిపారు.