Don't Miss!
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మనల్ని ‘బాహుబలి’గా, భళ్ళాలదేవుడిలా మార్చేందుకు రాజమౌళి స్కెచ్
త్వరలో ‘బాహుబలి’ సినిమా ఆధారంగా ఓ మొబైల్ గేమ్ రాబోతోంది. ఫార్మ్విల్లే, లార్డ్ ఆఫ్ రింగ్స్ వంటి వీడియో గేమ్స్ను డెవలప్ చేసిన మార్క్ స్కాగ్స్ దీనిని రూపొందించబోతున్నారు.
ముంబయి: మనమే బాహుబలిగా మారిపోయి కాలకేయుడిని అంతమొందించవచ్చు! అలాగే భళ్ళాలదేవుడిలా మారి రాజకీయ స్కెచ్ లు వేయచ్చు!! అదెలా సాధ్యం అనుకుంటున్నారా? త్వరలో 'బాహుబలి' సినిమా ఆధారంగా ఓ మొబైల్ గేమ్ రాబోతోంది.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన తాజా చిత్రం 'బాహుబలి'ని ఎంతగా ప్రమోట్ చెయ్యాలో అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా ఆ ప్రమోషన్ తో పాటు డబ్బులు వచ్చే మార్గం ఆయన ఎంచుకుంటూ నిర్మాతలకు ఆనందం కలగచేస్తున్నారు.
ఆ మధ్యన 'బాహుబలి' అనే మహావృక్షానికి సినిమా కేవలం ఓ కొమ్మ మాత్రమేనని చెప్పిన రాజమౌళి ...ఇందులో భాగంగా కామిక్బుక్స్, వీఆర్ మొదలైన వాటిని తీసుకొచ్చారు. త్వరలోనే 'బాహుబలి' మొబైల్ గేమ్ను తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించి మూన్ఫ్రాగ్ ల్యాబ్స్కు చెందిన మార్క్ స్కగాస్తో చర్చించారు.ఫామ్విల్లే, లార్డ్ఆఫ్ రింగ్స్ తదితర గేమ్లను సృష్టించింది ఈయేనే.
'బాహుబలి'
మొబైల్గేమ్కు
సంబంధించి
మార్క్
స్కగాస్తో
రాజమౌళి
చర్చలు
జరిపిన
చిత్రాలను
ఆర్కా
మీడియా
అభిమానులతో
పంచుకుంది.
ప్రభాస్,
రానా,
అనుష్క,
తమన్నా
కీలక
పాత్రల్లో
నటించిన
'బాహుబలి'
2015లో
విడుదలై
సంచలన
విజయం
నమోదు
చేసిన
సంగతి
తెలిసిందే.
దీనికి
కొనసాగింపుగా
'బాహుబలి:
ద
కన్క్లూజన్'
ఈ
ఏడాది
ఏప్రిల్
28న
విడుదలకు
సిద్ధమవుతోంది.
మరో ప్రక్క 'బాహుబలి 2' చిత్రం విడుదలకు ముందే రికార్డు సృష్టించిందట. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 500 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. కేవలం డిస్ట్రిబ్యూషన్, శాటిలైట్ రైట్స్ ద్వారా ఈ చిత్రం రూ. 500 రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల్లో చెప్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న 'బాహుబలి 2' చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. . 'బాహుబలి'కి కొనసాగింపుగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రలు పోషించారు.
'బాహుబలి'నిదాదాపు రూ. 180 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్లు వసూలు చేసి... 2015లో భారత్లో అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.