Don't Miss!
- News షర్మిలపై జగన్ కామెంట్స్ ! చంద్రబాబు కౌంటర్-సజ్జల ఎన్ కౌంటర్..!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరో ట్విస్ట్: కట్టప్ప చేతిలో బాహుబలి చనిపోలేదా?
హైదరాబాద్: 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' అనే ప్రశ్నకు సమాధానం కోసం యావత్ భారతదేశం మొత్తం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' పార్ట్ -1లో ఉత్పన్నమైన ఈ ప్రశ్నకు త్వరలో రాబోతున్న బాహుబలి పార్ట్-2 సమాధానం దొరక బోతోంది.
అయితే తాజాగా ఓ ఆంగ్లపత్రిక ఇంటర్వ్యూలో పాల్గొన్న 'బాహుబలి' రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. బాహుబలి చనిపోయాడని ఎందుకు భావించాలి? బ్రతికి కూడా ఉండొచ్చు అంటూ ట్విస్ట్ ఇచ్చారు. మరి విజయేంద్రప్రసాద్ వ్యాఖ్యలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.
'బాహుబలి' సినిమా విడుదలకు ముందే రెండు భాగాలకు సంబంధించిన స్క్రిప్టు పూర్తయింది. బాహుబలి భారీ విజయం తర్వాత సీక్వెల్ లో ఎటువంటి మార్పులు చేయడం లేదు అని ఆయన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు.
బాహుబలి సినిమాలోని పాత్రలు మహాభారతం, రామాయణంలోని పాత్రలను స్పూర్తిగా తీసుకుని రూపొందించినవే అని విజయేంద్రప్రసాద్ స్పష్టం చేసారు. బీష్ముడి స్పూర్తితో కట్టప్ప పాత్రను, శివగామిలో కైకేయి, గాంధారీ, కుంతి ఛాయలు కనిపిస్తాయని, బిజ్జలదేవ పాత్రలో శకుని తత్వం కనిపిస్తుందని, భల్లాలదేవ పాత్రలో రావణుడు, దుర్యోధనుడు కనిపిస్తాడని, బాహుబలిలో అర్జునుడు, రాముడు కనిపిస్తాడని చెప్పుకొచ్చారు.
బాహుబలి
రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి-2' శరవేగంగా తెరకెక్కుతోంది.
షూటింగ్
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
అంచనాలు భారీగా
తొలి భాగం భారీ విజయం సాధించిన నేపథ్యంలో బాహుబలి-2పై అంచనాలు భారీగా ఉన్నాయి.
రిలీజ్
2017 ఏప్రిల్ 14 నాటికి బాహుబలి పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.