Don't Miss!
- News Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మరో వివాదంలో బాహుబలి: దండెత్తుతున్న మాలలు
హైదరాబాద్: బాహుబలి చిత్రం మరో వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంపై మాలలు అభ్యతరం వ్యక్తం చేశారు. తాజాగా లీకైన బాహుబలి చిత్ర దృశ్యాల్లో మాలలను కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని సీసీఎస్లో మాలల సంక్షేమసంఘం ఫిర్యాదు చేసింది.
అయితే ఆసన్నివేశాలని పైరసీకి పాల్పడిన వారు సృష్టించారా? లేక చిత్రంలోనే అలా ఉన్నాయా అనే విషయంపై విచారణ చేస్తామని సీసీఎస్ పోలీసులు తెలిపారు. విడుదలకు ముందే సంచలనాలకు కారణమైన బాహుబలి చిత్రం విడుదలైన తర్వాత పరిస్థితి ఏమిటనేది సందేహంగా ఉంది.
విడుదలకు ముందే 'బాహుబలి' చిత్రంలోని దృశ్యాలు గతంలో లీకైన విషయం తెలిసిందే. దీని వెనుక చాలా తతంగం నడిచినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఐదారునెలల నుంచి ఈ దృశ్యాలను ల్యాబ్ నుంచి బయటకు తీసుకురావాలని సెంట్రల్ క్రైమ్ పోలీసులు పట్టుకున్న వర్మతో పాటు మరో ఇద్దరు ప్రయత్నించినట్లు ఆధారాలు లభించాయి. ఆ ఇద్దరిని పట్టుకునేందుకు డీసీపీ(నేరాలు) రవివర్మ ప్రత్యేక బృందాన్నినియమించారు.
'బాహుబలి'కి మరింత హంగులు తీసుకొచ్చే నేపథ్యంలో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి పోరాట దృశ్యాలను ఆకర్షణీయంగా చిత్రీకరించాలని మకుట విజువల్ ఎఫెక్ట్స్ సంస్థకు గత ఏడాది ఆగస్టులో అప్పగించారు. మకుట విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలో ఐటీ మేనేజర్గా పనిచేస్తున్న బివీవీఎల్ఎన్ వర్మపై అప్పటికే ఆరోపణలు రావడంతో విధుల నుంచి తొలగించారు.'
దీంతో వర్మ తన సంస్థకు ఏదైనా నష్టం చేయాలన్న కసితో అప్పుడప్పుడూ వస్తుండేవాడు. పాత ఉద్యోగి కావడంతో ఎవరికీ అనుమానం రాలేదు. గత ఏడాది అక్టోబరులో వర్మ తన ల్యాప్ట్యాప్లో 12 నిమిషాల నిడివి ఉన్న బాహుబలి చిత్ర దృశ్యాలను తస్కరించాడు. అనంతరం సొంతూరికి వెళ్లి అక్కడ ఇద్దరు, ముగ్గురితో విషయం చర్చించాడు.
వీటిని అంతర్జాలంలో ఉంచితే సినిమా అపజయం పాలవుతుందని చెప్పగా... ఓ పథకం రూపొందించారు. ల్యాప్టాప్లో ఉన్న పోరాట దృశ్యాలను మరో సీడీలోకి మార్చి ల్యాప్ట్యాప్లో దృశ్యాలను తొలగించారు. సంక్రాంతి సందర్భంగా ఈ వీడియోను అప్లోడ్ చేయాలని నిర్ణయించారు. కుదరకపోవడంతో జనవరి 23న యూట్యూబ్, ఫేస్బుక్లలో ఉంచారు.