Don't Miss!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
న్యూస్ రీడర్ బద్రి మృతికి ..బాలకృష్ణ నివాళి
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో న్యూస్ రీడర్ బద్రి(38) మృతి చెందాడు. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద శనివారం రాత్రి బంధువుల వివాహానికి హాజరై తిరిగి స్వగ్రామం నల్లచర్ల మండలం ఆవుపాడుకు వస్తుండగా లక్ష్మీనగర్ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బద్రి అక్కడికక్కడే మృతి చెందాడు. బాలకృష్ణ ఈ విషయం తెలుసుకుని వెంటనే ఆయన ఆత్మకు శాంతి కలగాలని నివాళులు అర్పించారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ మేరకు బాలకృష్ణ ప్రెస్ నోట్ విడుదల చేసారు. అందులో...
టీవి9 న్యూస్ ప్రెజంటర్ బద్రి దుర్మరణం చెందారన్న వార్త విని చింతింను. పలు అంశాలపై అనర్గళంగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడేవారు బద్రి. వార్తలను చక్కగా ప్రజెంట్ చేసేవారు. ద్వారక తిరుమల సమీపంలో కారు ముందు టైరు పగిలి చెట్టుకు ఢీ కొట్టిన ప్రమాదంలో ఆయన చనిపోయారని తెలిసింది. కారులో ప్రయాణిస్తూ గాయపడిన ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని భగవంతుడుని ప్రార్దిస్తున్నాను. ఆయన కుటుంబానికి ఎప్పుడూ నా సహాయ సహకారాలు ఉంటాయి.
బద్రి పూర్తి పేరు కాళ్ల వీరభద్రరావు. ప్రమాదంలో బద్రి భార్య లక్ష్మీసుజాత, కుమారులు సాయి, సాత్విక్, బద్రి బంధువు గండ్రోతు తారక్కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సాయి(12) ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను విజయవాడ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.