Don't Miss!
- Sports వేరీజ్ `మ్యాడ్` మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
బెల్లంకొండ సురేష్ ఆఫీసు సీజ్,అవే దెబ్బకొట్టాయి
హైదరాబాద్: ఒక టైమ్ లో నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీని ఏలారు. అయితే కుమారుడుని లాంచ్ చేసిన తర్వాత ఆయన పరిస్ధితి మారిపోయింది. ఎంతలా అంటే... సురేష్ కార్యాలయాన్ని గురువారం కొటక్ మహీంద్రా బ్యాంకు అధికారులు సీజ్ చేశారు
తమ వద్ద నుంచి తీసుకున్న రూ.11కోట్ల వరకు బ్యాంకు రుణం చెల్లించలేదని, అందుకే ఫిల్మ్ నగర్ లోని ఆయన ఆఫిస్ ని సీజ్ చేసినట్లు తెలిపారు. ఇది ఊహించని దెబ్బే. గత కొంతకాలంగా ఇండస్ట్రీోల ఆయన తీసుకున్న ఫైనాన్స్ కు కూడా సెటిల్ మెంట్స్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
బెల్లంకొండ సురేష్ తెలుగులో ఆది, చెన్నకేశవరెడ్డి, లక్ష్మీనరసింహా, గోలిమార్, ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించారు. బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ 'అల్లుడు శ్రీను' సినిమాతో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తాజాగా స్పీడున్నోడు అనే మరో సినిమాలో కూడా శ్రీనివాస్ నటించాడు. అంతలోనే ఆయన తండ్రి, నిర్మాత సురేష్ కార్యాలయం సీజ్ కావడం గమనార్హం.
అందుతున్న సమాచారం ప్రకారం ...అల్లుడు శ్రీను చిత్రాన్ని దాదాపు 30 కోట్లు వరకూ బడ్జెట్ పెట్టి తీసారు. ఆ సినిమా కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికి, కొత్త హీరో కావటంతో దాదాపు 15 కోట్లు వరకూ నష్టపోయినట్లు తెలుస్తోంది. దీనితో పాటు ఆయన మిగతా సినమాల్లోనూ కొంత పోగొట్టుుకున్నట్లు చెప్తున్నారు.