Don't Miss!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రవితేజ ‘బెంగాల్ టైగర్’ రిలీజ్ మళ్లీ వాయిదా పడింది
హైదరాబాద్: సంపత్ నంది దర్శకత్వంలో రాధామోహన్ నిర్మిస్తున్న ‘బెంగాల్ టైగర్' చిత్రాన్ని షూటింగ్ ప్రారంభం రోజునే వినాయక చవితి కానుకగా విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ 'కిక్ -2' విడుదలలో జరిగిన జాప్యం కారణంగా ఈ చిత్రం విడుదల దసరాకు, ఆ తర్వాత దీపావళికి వాయిదా వేశారు.
తాజాగా అందుతున్న ఇప్పుడు మరింత వెనక్కి వెళ్ళింది 'బెంగాల్ టైగర్'. నవంబర్ 27న సినిమాను విడుదల చేయాలని భావించినా... ఆ రోజున అనుష్క 'సైజ్ జీరో' వస్తుండటంతో డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రావాలనే నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయమైన త్వరలోనే అఫీషియల్ ప్రకటన వస్తుందని అంటున్నారు.
ఈ చిత్రంలో రవితేజ తను అమితంగా ప్రేమించే తండ్రిని చంపిన విలన్స్ ని సంహరించి, పగ తీర్చుకునే కొడుకుగా కనిపించనున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా ఫ్యామిలీ రివేంజ్ డ్రామాగా సాగనుందని తెలుస్తోంది. రవి తేజ సరసన తమన్న, రాశి ఖన్నాలు ఆడిపాడునున్నారు.
సంపత్ నంది రెండవ సినిమా రచ్చలో కూడా తమన్ననే హీరోయిన్ కావడం విశేషం. ఏమైంది ఈ వేళతో ప్రతిభ గల దర్శకునిగా పేరు తెచ్చుకున్నాడు. రెండవ సినిమాతోనే రామ్ చరణ్ సినిమాకు దర్శకత్వం చేశాడు. రచ్చ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్2 కు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది.
ఆ సినిమా స్రిప్టు తయారు చేసే పనిలో దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయాయి. కారణం ఏంటో తెలియదు కాని ఆ సినిమా నుంచి సంపత్ నంది తప్పుకున్నాడు. అనూహ్యంగా రవితేజాను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. రవితేజకు తమన్నతో తొలి సినిమా.