Don't Miss!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తణికెళ్ల భరణికు మరో ఎదురుదెబ్బ?
హైదరాబాద్ : మిధునం చిత్రం తర్వాత తణికెళ్ల భరణి దర్శకత్వంలో చిత్రం గురించి అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటివరకూ ఏదీ మెటీరయలైజ్ కాలేదు. ఆ మధ్యన శర్వానంద్ తో అనుకున్న ఊరి చివరి గుడెసె ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. ఆ తర్వాత ఆయన సునీల్ తో భక్త కన్నప్ప అనుకున్నారు.
కానీ రకరకాల చర్చలు, లెక్కలతో ఆ ప్రాజెక్టూ మెటీరియలైజ్ కాలేదు. ఇంతలో ఎంత బడ్జెట్ అయినా సరే అంటూ రంగలోకి మంచు విష్ణు దిగి, తన సొంత బ్యానర్ అయిన 24 ఫ్రేమ్స్ పై నిర్మిస్తానని, అందులో హీరోగా తనే చేయ్యాలి నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఆఫీస్ తీసి, ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు. కాని ఇప్పుడు అది కూడా మిస్ అయిందని సమాచారం.
విష్ణుతో అనుకున్న ఈ సినిమా ఆగిపోవాడానికి కారణం...ఇండస్ట్రీలో చెప్పుకునే దాని ప్రకారం నిన్నటి వరకు లోకల్ నిర్మణ సంస్థగా వున్న 24 ప్రేమ్స్, ఈ మధ్యే ఇంటర్నేషనల్ అయ్యింది. దానితో ఈ సినిమాకు ఇంటర్నేషనల్ స్థాయిలో తీయడానికి ఓ టీంని ఏర్పాటు చేసారు. ఆ టీం చెప్పిన మార్పులకు, భరణి ఆలోచనలకు పోంతన కుదరక పోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది.
ఏది ఎమైనా భారి బడ్జేట్ సినిమాగా రూపొందాల్సిన సినిమా క్రియేటివ్ డిఫెరెన్స్ లతో ఆగిపోవడం అభిమానులకు కొంత భాదగానే వుంటుంది. మరి ఇప్పుడు ఈ సినిమాను ఎవరి చేతుల్లోకి తీసుకుంటారో వేచి చూడాలి. వీటికి తోడు..కృష్ణరాజు గారు ..ప్రభాస్ తో భక్త కన్నప్ప రీమేక్ చేస్తానని చెప్తున్నారు.