Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రీ ఎంట్రీ ఖరారు చేసిన భూమిక
ముంబై: "అవును, నేను ఆ సినిమా చేస్తున్నాను. కాని ఇప్పుడు నా క్యారక్టర్ ఏమిటనేది రివీల్ చేయలేను. చాలా గ్యాప్ తర్వాత హిందీ చిత్రం చేస్తూండటంతో చాలా ఎక్సైటింగ్ గా ఉంది ," అన్నారు భూమిక.
భారత క్రికెట్ వన్డే జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 'ఎం.ఎస్.ధోని- ది అన్టోల్డ్ స్టోరీ' పేరుతో హిందీలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో మన తెలుగు మాజీ హీరోయిన్ భూమిక ఓ కీలకమైన పాత్రలో కనిపించనుందని సమాచారం. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం లడ్డూ బాబు.
గతంలో ఆమె బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో తేరే నామ్, దిల్ నే జైసీ అప్నే కహా, గాంధీ మై ఫాధర్ వంటి చిత్రాలు చేసింది. ఆ తర్వాత తెలుగులో పూర్తి దృష్టి పెట్టిన ఆమె ఇక్కడ కూడా చేయటం మానేసింది. అయితే తాజాగా ఈ చిత్రం తో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి 'బేబి, స్పెషల్ 26, ఎ వెడ్నెస్డే' వంటి వినూత్న చిత్రాలకు దర్శకత్వం వహించిన నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధోని పాత్రలో హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటిస్తున్నారు. చిత్రంలో అప్పటి ధోని సహచరులు నటించనున్నారు. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ధోనీ తండ్రి పాత్ర పోషిస్తున్నారు.
చిత్రం స్క్రిప్ట్ చదివానని అద్భుతంగా ఉందని నటుడు అనుపమ్ ఖేర్ దర్శకుడిని అభినందించారు. నీరజ్ పాండే తన అభిమాన దర్శకుడని, ఆయన స్క్రిప్ట్ రూపొందించే విధానం అద్భుతంగా ఉంటుందని ఆయన కితాబిచ్చారు. ఆయన దర్శకత్వం వహించిన 'బేబి' చిత్రం స్క్రిప్ట్ని ఆస్కార్ లైబ్రరీలో ఉంచేందుకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.