Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాలయ్య తో మెగాస్టార్... "రైతు" ఇంక రచ్చే
'గౌతమీపుత్ర శాతకర్ణి' షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఈ మూవీ సంక్రాంతి బరిలోకి దింపాలనే ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే తన నెక్ట్స్ సినిమాకు చకచకా సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే తన తదుపరి చిత్రం కోసం బాలయ్య రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. బాలకృష్ణ తన 101వ సినిమాగా కృష్ణవంశీ దర్శకత్వంలో ''రైతు'' అనే చేస్తున్నట్టు బాలయ్య ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
డిసెంబర్లోనే 'రైతు' సెట్స్ మీదికి వెళ్తుందని కృష్ణవంశీ నుంచి స్పష్టం వచ్చింది. ఐతే బాలయ్య-కృష్ణవంశీ కలిసి అమితాబ్ బచ్చన్ ను కలవడానికి ప్రత్యేక కారణం ఉండొచ్చన్న ఊహాగానాలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. బాలకృష్ణ 101వ సినిమాలో అతిథి పాత్ర పోషించాలని బాలయ్య.. బిగ్-బిని అడిగాడని కూడా ఒక ప్రచారం మొదలైపోయింది సోషల్ మీడియాలోహల్చల్ మొదలు పెట్టింది.
Photos: మెగాస్టార్ తో బాలకృష్ణ
ఈ నేపథ్యంలోనే కథ ను క్లుప్తంగా చెప్పడం కోసం కృష్ణవంశీని వెంట తీసుకెళ్లినట్లుగా సమాచాం అందుతోంది. ఆ సంగతెలా ఉన్నా బాలయ్య-అమితాబ్-వర్మ-కృష్ణవంశీలను ఒక ఫ్రేమ్ లో చూడటం జనాలకు మంచి అనుభూతినిచ్చింది. గతంలో అక్కినేని ఫ్యామిలీ మూవీ మనంలో కూడా చిన్న గెస్ట్ రోల్లో నటించిన సంగతి తెలిసిందే. అమితాబ్ గెస్ట్రోల్లో కనిపిస్తే ఆ సినిమాకు వచ్చే మాజానే వేరని సినీ పండితుల అభిప్రాయం.
రామోజీ ఫిలిం సిటీలో 'సర్కార్-3'షూటింగ్ లో పాల్గొంటున్న అమితాబ్ బచ్చన్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమితాబ్ ను బాలయ్య,కృష్ణవంశీ కలవడమే కాకుండా వర్మ కూడా ఉన్నారు. డిసెంబర్లోనే 'రైతు'సెట్స్ మీదికి వెళ్తుందని కృష్ణవంశీ నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది.
అయితే ఖచ్చితంగా ధృవీకరణ రాక్లేదు గానీ ఈ భారీ చిత్రం 'రైతు'లో నటించడానికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు అన్న వాత మాత్రం బలంగానే వినిపిస్తోంది. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో అమితాబ్ లాంటి స్టేచర్ వున్న నటుడు నటిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో బాలకృష్ణ, కృష్ణవంశీ కలసి మొన్న ప్రత్యేకంగా ముంబయ్ వెళ్లి ఆయనను కలసి, రిక్వెస్ట్ చేసిన సంగతి విదితమే.
నందమూరి కుటుంబం పట్ల వున్న అభిమానంతోనూ, చిత్రంలోని పాత్ర నచ్చడంతోను ఈ సినిమాలో నటించడానికి అమితాబ్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఫిబ్రవరి నెలలో 17 రోజుల కాల్ షీట్స్ కూడా ఆయన అప్పుడే కేటాయించినట్టు సమాచారం. దీంతో ముందుగా అమితాబ్ వుండే సన్నివేశాలను చిత్రీకరించడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట.