Don't Miss!
- News టీడీపీ నేతలకు చేదు అనుభవం..మహిళ ప్రశ్నలకు బిత్తరపోయిన నాయకులు
- Technology Whatsapp Filters వాట్సాప్లో ఫిల్టర్స్ పేరుతో కొత్త ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..!!
- Sports IPL 2024: హార్దిక్ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Finance Gold Price: శుభవార్త.. ఆకాశం నుంచి విరిగిపడ్డ బంగారం ధర.. షాపింగ్ షురూ చేసేయండి..
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
ఇరికించారా?... చక్రి, పరుచూరిపై కేసు వాపస్
హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి, నిర్మాత పరుచూరి ప్రసాద్లపై రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఓ యువతి వీరిపై ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తన ఫిర్యాదును యువతి ఉపసంహరించుకున్నట్లు సమాచారం.
సదరు యువతి తాగిన మత్తులో ఫిర్యాదు చేసినట్లు పోలీసులకు చెప్పిందని, అందుకే తన ఫిర్యాదు ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించిందని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. స్నేహితుల దినోత్సవం రోజున జరిగిన ఓ అనూహ్య సంఘటన ఫిర్యాదుకు దారి తీసినట్లు సమాచారం.
స్నేహితుల దినోత్సవం రోజున చక్రి, పరుచూరి ప్రసాద్ కలిసి డిన్నర్ చేస్తున్న సమయంలో యువతి యొక్క ఫ్రెండ్ వారిని ఫోటో తీసేందుకు ప్రయత్నించారని, అయితే తమను సెల్ ఫోన్లో ఫోటోలు తీయొద్దని వారు అడ్డు చెప్పడంతో...యువతి, ఆమె ఫ్రెండ్ అసహనానికి గురయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే చిన్నపాటి వాదులాట చోటు చేసుకున్నట్లు సమాచారం. ఆ కోపంతోనే వారు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే సంగీత దర్శకుడు చక్రిపై ఒక్కసారిగా ఇలాంటి కేసు నమోదు కావడంతో అంతా అవాక్కయ్యారు. కేసు ఉపసంహరించుకోవడంతో చక్రి అభిమానులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.