Don't Miss!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అదీ చిరు స్టామినా.... ట్రెండింగ్ లో రచ్చ రచ్చ
హైదరాబాద్: మొత్తానికి చిరంజీవి 150వ చిత్రం పూరి జగన్నాథ్తోనే అనే వార్త ఫిల్మ్నగర్ దాటి, మీడియాలో ప్రముఖంగా వచ్చేసింది. ముఖ్యంగా ఈ చిత్రం గురించి రామ్చరణ్ తొలిసారి స్పందించటం తో అంతటా హాట్ టాపిక్ గా మారింది. జాంచో ఒక్కసారిగా అభిమానుల మధ్య ఈ చిత్రం గురించి చర్చలు మొదలయ్యాయి. దాంతో 'Chiru150' అంటూ హేష్ ట్యాగ్ లు దేశం అంతటా మొదలయ్యాయి. దాంతో ట్రెండింగ్ లో ఐదవ ప్లేస్ లో వచ్చింది.ఒక టైమ్ లో సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది. హైదరాబాద్ ట్రెండ్ లలో పస్ట్ ఫ్లేస్ లోకి వచ్చింది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఇక ''ఔను.. నిజమే. డాడీ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ చిత్రం కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నా'' అంటూ ఫేస్బుక్లో ఓ సందేశాన్ని ఉంచారు చరణ్. ఈ చిత్రానికి రామ్చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తారు. చరణ్ని హీరోగా వెండితెరకు పరిచయం చేసింది పూరినే. ఇప్పుడు చరణ్ పూరి చిత్రంతోనే నిర్మాతగా మారుతున్నారు.
మరో వైపు పూరి జగన్నాథ్ కూడా చిరు 150వ సినిమాపై స్పందించారు. ''ఒకప్పుడు చిరంజీవి సినిమాకి థియేటర్ల దగ్గర డెకరేషన్లు చేసేవాడికేం తెలుసు? ఏదో ఒకరోజు వాడే ఆయన 150వ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని? దయచేసి అతన్ని దీవించండి'' అంటూ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం 'జ్యోతిలక్ష్మీ'కి సంబంధించి నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు పూరి. ఆ తరవాత చిరు చిత్రంపై దృష్టిసారిస్తారు. అన్ని మేజర్ సిటీల్లోనూ ...టాప్ టెన్ లో ఈ విషయం ట్రెండింగ్ ఉండటం హాట్ టాపిక్ గా మారింది.
చిరంజీవి 150వ చిత్రం ఖరారైంది. కొన్ని సంవత్సరాలుగా ఈ సినిమా గురించి వార్తలు రావడం, ఇప్పటివరకూ అవి వాస్తవ రూపం ధరించకపోవడం తెలిసిందే. ఇప్పుడు అధికారికంగా రామ్చరణ్ ఈ సినిమా విషయాన్ని ధృవీకరించంటం అభిమానుల్లో చెప్పలేని ఆనందం కలిగించింది. నిజానికి కొద్ది రోజుల క్రితమే బండ్ల గణేశ్ ఈ విషయాన్ని పరోక్షంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పూరి కూడా తన ఉద్వేగాన్ని బయటపెట్టకుండా ఉండలేకపోయారు.
ఇక ఈ చిత్రానికి కథను అందిస్తున్న బీవీఎస్ రవి ‘‘మెగాస్టార్ నుంచి అంగీకారం పొందడం ఎంతో ఉత్తేజంగా, ఉద్వేగంగా ఉంది'' అని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ చిరంజీవి జన్మదినమైన ఆగస్ట్ 22న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఆ రోజు ఆయన షష్ఠి పూర్తి కావడం కూడా విశేషం.
చిరంజీవి హీరోగా నటించిన చివరి సినిమా ‘శంకర్దాదా జిందాబాద్' 2007 జూలైలో విడుదలైంది. అంటే అది వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి హీరోగా ఆయన కెమెరా ముందుకు రాబోతున్నారన్న మాట.