Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సంపూ... చించేసాడు అంటూ చిరంజీవి అభినందన!
హైదరాబాద్: హృదయ కాలేయం' సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుని వరుస అవకాశాలతో తూసుకెలుతున్న సంపూర్ణేష్ బాబు బాబు త్వరలో 'కొబ్బరి మట్ట'తో ప్రేక్షకులపై దాడి చేయబోతున్నాడు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయం చేస్తుండటం గమనార్హం.
ఈచిత్రానికి సంబందించిన టీజర్ ఇటీవల విడుదలైంది. ఇందులో సంపూ చెప్పిన భారీ డైలాగ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. పెదరాయుడి పాత్రలో గుక్కతిప్పుకోకుండా డైలాగ్ చెప్పి సంపూర్ణేష్ బాబు అదరగొట్టారని అంటున్నారంతా.
ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి నుండి కూడా సంపూకు ప్రశంసలు అందాయి. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిూస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి చిరంజీవి హాజరు కాగా... అక్కడ చిరంజీవిని కలిసే అవకాశం దక్కించుకున్నాడు సంపూ. ఈ సందర్భంగా తన కొబ్బరి మట్ట టీజర్ చూపించాడు. అది చూసిన తర్వాత చిరంజీవి... సంపూను డైలాగ్ బాగా చెప్పావ్ అంటూ ప్రశంసించారట.
ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయం చేస్తుండటం గమనార్హం. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు అనే మూడు డిఫరెంట్ పాత్రల్లో సంపూర్ణేష్ బాబు కనిపించబోతున్నారు. ఇప్పటికే పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు పాత్రకు సంబంధించిన లుక్ రిలీజ్ చేసారు. రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, గుడ్ సినిమా గ్రూప్, సంజన మూవీస్ పతాకంపై ఆది కుంభగిరి, సాయి రాజేష్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.