Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ స్టోరీ చేసేది కేవలం చిరంజీవి మాత్రమే!
హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా... గత కొంతకాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్. అదిగో ఇదిగో అంటూ సంవత్సరాలకు సంవత్సరాలు సాగిస్తున్నారు. సరైన స్టోరీ దొరకక పోవడం వల్లనే 150వ సినిమా మొదలు కావడం లేదని అభిమానులు అడిగినప్పుడల్లా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు చిరంజీవి, రామ్ చరణ్.
చిరంజీవి 150వ సినిమా చేయడం మాత్రం ఖాయం. ప్రస్తుతం కథల గురించి అన్వేషణ తీవ్రంగా సాగుతోంది. ఇటీవల కత్రి రీమేక్ లో చిరంజీవి చేద్దామని అనుకున్నారు కానీ.... ఫ్రెష్ స్టోరీ చేయాలని అభిమానుల నుండి ఒత్తిడి పెరగడంతో వెనక్కి తగ్గారు. తాజాగా ఫిల్మ్ నగర్లో మరో స్టోరీ హాట్ టాపిక్ అయింది.
హిందీలో రాజ్ కుమార్ హిరానీ సంజయ్ దత్ హీరోగా మున్నాభాయ్ సిరీస్ లో రెండు సినిమాలు చేసారు. అవే సినిమాలు చిరంజీవి తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ పేరుతో రీమేక్ చేసి సక్సెస్ అయ్యారు. తాజాగా రాజ్ కుమార్ హిరానీ మున్నాయ్ మూడో పార్ట్ కూడా అనౌన్స్ చేసారు.
హిందీలో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కితే.... తెలుగులో చిరంజీవి దాన్ని చేయడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే తొలి రెండు పార్టులు చిరంజీవి చేసిన నేపథ్యంలో చిరంజీవిని తప్ప ఆ స్టోరీలో మరో హీరోను ఊహించుకోవడం కష్టమే.
మున్నాయ్ భాయ్ మూడో భాగాన్ని రాజ్ కుమార్ హిరానీ పూర్తి విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ తెలుగు వెర్షన్లో మాత్రం చిరంజీవి నటించడం ఖాయం.