Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
విదేశీ దేవాలయానికి చిరంజీవి విరాళం
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా నేపాల్లోని పశుపతినాథ్ టెంపుల్ను దర్శించుకున్న సంగతి తెలిసిందే. పరమ శివుడికి సంబంధించిన ఈ దేవాలయం 5వ శతాబ్దంలో నిర్మించారు. ఆయల కమిటీ నుండి అందిన సమాచారం ప్రకారం చిరంజీవి ఈ దేవాలయానికి రూ. 2 లక్షల విరాళం ఇచ్చి ప్రత్యేక పూజలు జరిపించినట్లు తెలుస్తోంది.
చిరంజీవి కంటే ముందు ఆ మధ్య ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ దేవాలయాన్ని సందర్శించారు. ఆలయానికి మోడీ రూ. 2 కోట్ల విలువ చేసే 2,500 కేజీల ఎర్రచందనం దుంగలను విరాళంగా ఇచ్చినట్లు తెలిసింది. అదే విధంగా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇటీవల దేవాలయాన్ని సందర్శించి రూ. 5,100 విరాళం ప్రకటించారు.
ఇక
చిరంజీవి
150వ
సినిమా
విషయానికొస్తే......
త్వరలోనే
సినిమా
ప్రారంభిస్తామని
తెలిపారు.
ఈ
సినిమా
సబ్జెక్ట్
అందరినీ
అలరించే
విధంగా
ఉంటుంది.
ప్రేక్షకులకు
మెసేజ్
ఇచ్చే
విధంగా
సందేశాత్మక
చిత్రం
తీస్తే
మన
ప్రేక్షకులు
చూసే
పరిస్థితి
లేదు.
అందుకే
శంకర్దాదా,
రౌడీ
అల్లుడు
లాంటి
ఎంటర్టైన్మెంట్
చిత్రాన్నే
చేస్తాను
అన్నారు
చిరంజీవి.
ప్రస్తుతం ప్రొడక్షన్ ఖర్చు బాగా పెరిగింది. నిర్మాత బాగు కోసం వాటిని తగ్గించాల్సిన అవసరం ఉంది. హీరో, హీరోయిన్ల పారితోషికం నుంచి రకరకాల ప్రొడక్షన్ ఖర్చుల దాకా అన్నింటినీ పరిశీలించి తక్కువ బడ్జెట్తో 150 సినిమా చేస్తానని చిరంజీవి అంటున్నారు. చిరంజీవి 150వ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా ఉండబోతున్నారు.