Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నష్టాల ‘రుద్రవీణ’-చిరంజీవి గొప్ప సినిమా ఎలా?(స్పెషల్ స్టోరీ)
చిరంజీవికి నటన పరంగా ఎనలేని కీర్తిని తెచ్చి పెట్టిన 'రుద్రవీణ' చిత్రం ఆయన సీని కెరీర్లో ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో ఒకటిగా, కలికితు రాయిగా నిలిచింది. ఈ సినిమాకున్న మరో ప్రత్యేకత చిరంజీవి సోదరుడు నాగబాబు ఈ చిత్రం ద్వారానే నిర్మాతగా పరిచయం అయ్యారు. చిరంజీవి సూచన మేరకు వారి తల్లిగారి పేరు మీదన అంజని ప్రొడక్షన్ పతాకం స్థాపించి నిర్మాతగా మారారు. 1988 మార్చి 4 తేదీన విడుదలైన ఈచిత్రం నేటితో పాతికేళ్లు పూర్తి చేసుకుంది.
సమాజంలో కులజాఢ్యం బాగా ఎక్కువగా ఉన్న ఆ రోజుల్లో.....దాన్ని తెగనరుకుతూ రూపొందిన ఈ చిత్రం ఒక మంచి సామాజిక చిత్రంగా పేరు తెచ్చుకుంది. అయితే నిర్మాతగా మాత్రం నాగబాబుకు నష్టాలనే మిగిల్చింది. అప్పట్లో దాదాపు రూ. 80 లక్షలు ఖర్చు పెట్టిన ఈచిత్రం నాగబాబుకు రూ. 6 లక్షల నష్టాన్ని మిగిల్చింది. ఈచిత్రం వల్ల నష్టపోయానని కొంత నిరాశ పడ్డప్పటికీ ఓ గొప్ప సినిమాను తీసాననే ఆత్మసంతృప్తి, గర్వం ఇప్పటికీ ఉంటుందని చెబుతుంటారు నాగబాబు.
'రుద్రవీణ' టైటిల్ పెట్టడానికి ముందు మొదట్లో 'బిలహరి' అనుకున్నారట. ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారి గణపతి శాస్త్రి బిలహరి రాగంలో నిష్ణాతుడు. ఆ రోజుల్లో రాగాల పేర్లతో 'శివరంజని, శంకరా భరణం, ఆనందభైరవి' లాంటి సినిమాలు వచ్చాయి. దీంతో ఆ టైటిల్ వద్దనుకున్నారు. గణపతి శాస్త్రి స్వభావ రీత్యా రుద్రావతారమే. కాబట్టి రుద్రవీణ టైటిల్ ఖరారు చేసారు.
సూర్యం(చిరంజీవి), లలిత(శోభన), గణపతి శాస్త్రి(జెమినీ గణశన్) పాత్రల చుట్టే సినిమా మొత్తం తిరుగుతుంది. అడవిలో గొడ్డలి చప్పుళ్ల శ్రుతిలయలు విన్న సూర్యం శ్రామికుల వినోదం కోసం ఒక జానపద గీతం పాడాడు. గణపతిశాస్త్రి విని అది ఏ రాగం అని అడిగితే హంసధ్వని అని సూర్యం అనగా కాదు 'హింసధ్వని' అంటారాయన కోపంగా. అలా తండ్రి కొడుకుల మధ్య విభేదాలు మొదలవుతాయి.
నువ్వు నా కొడుకువని ఎప్పుడూ చెప్పుకోకూడదని శాసిస్తాడు తండ్రి. నేను నీ తండ్రినని చెప్పాల్సిన గర్వపడే రోజు వస్తే అప్పుడు నేను నిన్ను వెతుక్కుంటూ వస్తాను, పుత్రగాత్ర (శరీరం) పరిష్యంగ సుఖాన్ని అనుభవిస్తానని ఒక రకమైన సవాలు చేసాడు గణపతిశాస్త్రి. ఆ సవాలుకు సూర్యం జవాబే, మిగిలిన కథాంశం. ఈ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు దాన్ని సంగీతంతో చల్లబరిచే చికిత్స చాలా గొప్ప ఆలోచన.
సంగీతం విషయంలో తండ్రికి శిష్యుడే అయినా, కులాలు అస్పృశ్యత వంటివి పట్టించుకోకుండా, ఆర్తులను ఆదుకోవడానికే పెద్దపీట వేస్తూ, ఈ అంశంలో తండ్రిని ధిక్కరించినవాడిగా, కుటుంబంలో పరాయివాడుగా వుండాల్సిన పరిస్థితిలోను, నిమ్నజాతి వారితో కలిసిపోయిన వాడుగా, తాగుబోతుల మాటలకు ప్రేమను పెళ్లిని త్యాగం చేసి, సమాజసేవపైనే దృష్టి పెట్టినవానిగా, సూర్యనారాయణ (సూర్యం) పాత్రలోను, పాటలున్న సన్నివేశాల్లోనూ మంచినటన ప్రదర్శించారు చిరంజీవి.
జాతీయస్థాయిలో జాతీయ సమైక్యతను ప్రభోదించే ఉత్తమ చిత్రంగా నర్గీస్దత్ అవార్డ్ని, ఇళయరాజాకు ఉత్తమ సంగీత దర్శకుడు, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకి ఉత్తమ గాయకుడు అవార్డును దక్కించు కుంది. రాష్ట్రస్థాయిలో నంది అవార్డులలో ఉత్తమ నటుడుగా జ్యూరీ అవార్డు మాత్రమే దక్కించుకోగలిగింది. గణేశ్ పాత్రోకి మాటల రచయితగా నంది అవార్డ్ తీసుకొచ్చింది. అంజనా ప్రొడక్షన్స్ పతాకాన చిరంజీవి నాగబాబు నిర్మించిన ఈ చిత్రంలోని పలు అంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి, ముఖ్యమంత్రులకు స్ఫూర్తినిచ్చి, ఆ చిత్రంలోని అంశాలను తమ పథకాలుగా ప్రవేశపెట్టారంటే...ఈ సినిమా గొప్పతనం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.