Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దటీజ్ మెగాస్టార్! ఉయ్యాలవాడపై చిరంజీవి అనూహ్య నిర్ణయం.. అదేమిటంటే..
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకొనున్న ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి చిత్ర ప్రారంభోత్సవ తేదీని ఫిక్స్ చేసినట్టు సమాచారం అందుతున్నది. ముందుగా అనుకొన్న ప్రకారం చిరంజీవి బర్త్డే రోజున కాకుండా దానికంటే ముందే ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. షూటింగ్ ప్రారంభమైన తర్వాత నిరవధికంగా చిత్రీకరణ జరిపే విధంగా చర్యలు తీసుకొన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
జాతీయస్థాయి చిత్రంగా ఉయ్యాలవాడ
పదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఖైదీ నంబర్ 150 చిత్రంతో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం అద్బుతమైన కలెక్షన్లను సాధించింది. ఆ తర్వాత స్వాతంత్ర్య సమరయోధుడు చిత్ర కథతో మెగాస్టార్ సిద్దమవుతున్నాడు. ఈ చిత్రానికి నిర్మాతగా తనయుడు రాంచరణ్ వ్యవహరిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జాతీయ స్థాయి చిత్రంగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఆగస్టు 15న ముహూర్తం ఖరారు?
18వ శతాబ్దానికి సంబంధించిన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తన జన్మదినం ఆగస్టు 22న కాకుండా ఆగస్టు 15న ప్రారంభించాలని చిరంజీవి భావిస్తున్నారట. ఓ పోరాట యోధుడి జీవితంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పంద్రాగస్టు రోజున అయితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి కోసం కొణిదెల ప్రొడక్షన్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం.
నిరవధికంగా ఉత్తర భారతంలో షూటింగ్
మెగా క్యాంపులో రేసుగుర్రం ధ్రువ లాంటి హిట్లను అందించిన ఘనత కలిగిన సురేందర్రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం ఉత్తర భారత దేశంలో జరిపే అవకాశం ఉంది. లాంచ్ తర్వాత రెగ్యులర్గా షూటింగ్ నిర్వహించి వచ్చే వేసవికి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నం ఉన్నారు.
నయనతార కన్ఫర్మ్.. సోనాక్షి, ఐశ్వర్యలో ఒకరు..
ఉయ్యాలవాడలో బాలీవుడ్ తారలు సోనాక్షి సిన్హా, ఐశ్వర్యరాయ్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా హీరోయిన్ ఎంపిక విషయంలో అనూహ్యమైన పరిణామం చోటుచేసుకొన్నది. చిరంజీవి పక్కన నయనతారను ఎంపిక చేసినట్టు మీడియాలో వార్తలు ప్రచారమవుతున్నాయి. అలాగే సోనాక్షి, ఐశ్వర్యలలో ఒకరిని తీసుకొనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. కాగా ఈ వార్తలకు సంబంధింంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.