Don't Miss!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మళ్ళీ ఆగిన చిరు 150: వ్యవహారం కోర్టుకెళ్తోందా..?
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది? చిరును స్క్రీన్పై చూసి ఆనందించేదెప్పుడు? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ ఎదురుచూపులు ఇంకా కొన్నాళ్ళు తప్పేలా లేవు. తాను సినిమాల్లోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో పాటు రామ్ చరణ్ నిర్మాణంలోనే ఆ సినిమా ఉంటుందని చిరంజీవి స్వయంగా తెలిపిన రోజునుంచి మొదలైన ఈ క్రేజ్ ఇప్పటికీ అదే స్థాయిలో కొనసాగుతున్నా, ఆ ప్రాజెక్టు మాత్రం ఇప్పటికీ ముందుకు కదల్లేదు.
చిరంజీవి సినిమాల్లో రీఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినపుడే సినిమా మొదలయ్యుంటే ఇప్పటికి విడుదలయ్యి వంద రోజుల పండగ కూడా జరిగిపోయేది. ఇన్నాళ్ళ ఎదురుచూపులన్నీ పూజా కార్యక్రమాలకే పరిమితమయ్యాయి. సరే ఇకనైనా మెగాస్టార్ యాక్షన్ షురూ అవుతుందనుకుంటే అదీ జరిగేలా లేదు.
. తాజా సమాచారం ప్రకారం... తన 150వ సినిమాను జులైలో సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో చిరంజీవి ఉన్నారట. దీనికి ముఖ్యంగా 2 -3 కారణాల్ని ప్రధానంగా చెబుతున్నారు. వీటిలో ముఖ్యమైనది లీగల్ ప్రాబ్లమ్. నరసింహారావు అనే వ్యక్తి చిరంజీవి 150వ సినిమా కథ తనదే అంటూ కొన్ని రోజులుగా వాదిస్తున్నారు. నిజానికి కాస్త మొత్తం ముట్టజెప్పి సమస్యను సర్దుబాటు చేసుకోవాలని మెగాకాంపౌండ్ భావించింది.
కానీ సదరు రచయిత మాత్రం దాదాపు 2 నుంచి 3 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. దీంతో ఈ వివాదంపై రెండు పార్టీలు కోర్టుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు చిరంజీవి కొన్ని నెలలుగా భుజం గాయంతో ఇబ్బందిపడుతున్నారు. ముంబయిలో అర్జెంట్ గా భుజానికి శస్త్రచికిత్స చేసుకోవాలి. అది కూడా పెడింగ్ లో ఉంది.
ఈ రెండు రీజన్స్ తో పాటు స్క్రీన్ ప్లే పక్కాగా పూర్తికాకపోవడం, హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాకపోవడం, ఎండలు మండిపోతుండడం, నిర్మాతగా మారడానికి చరణ్ కాస్త బిజీగా ఉండడం లాంటి కారణాలు కూడా చిరంజీవి 150వ సినిమాను డైలమాలో పడేశాయి.
మరో సమస్య కూడా ఏంటంటే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంపికైన దేవిశ్రీప్రసాద్. ప్రస్తుతం బాలయ్య శాతకర్ణి సినిమా కోసం పనిచేస్తున్నాడు. చిరంజీవి 150కు ట్యూన్స్ కంపోజ్ చేయడానికి మరింత సమయం కోరాడట. సో...! ఈ కారణాలన్నీ దృష్టిలో పెట్టుకొని మరో 2 నెలలు సినిమాను వాయిదా వేసుకున్నారు.
దాంతో ప్రీ ప్రొడక్షన్ పనులపై నిశితంగా దృష్టి సారిస్తున్నారు వినాయక్ అండ్ కో. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను తన నెత్తిన వేసుకున్న చరణ్ తన సినిమా షూటింగ్కు కూడా డుమ్మా కొట్టినట్టు అప్పట్లో కథనాలు వెలవడ్డాయి. ఇప్పుడెలాగో చిరు సినిమా వెనక్కి వెళ్ళింది గనక చెర్రీ మళ్ళీ తన యాక్షన్ మొదలుపెడతాడేమో చూడాలి.