Don't Miss!
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రోడ్డు ప్రమాదంలో సినిమా యూనిట్ సభ్యుల మృతి
సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెలుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరామెన్ తో సహ ఇద్దరు దుర్మరణం చెంది ఇద్దరికి గాయాలు అయిన సంఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లాలో జరిగింది. గత 15 రోజుల నుండి ‘శిరాడిఘాట్' అనే కన్నడ సినిమా షూటింగ్ మలేనాడు పరిసర ప్రాంతాలలో నిరవదికంగా జరుగుతున్నది. బెంగళూరులో నివాసం ఉంటున్న చిరంజీవి (32) అనే యువకుడు ఈ సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్ గా పని చేస్తున్నాడు.
సోమవార రాత్రి సినిమా షూటింగ్ ముగించారు. తరువాత వారి వారి వాహనాలలో మలెనాడు నుండి బెంగళూరు బయలుదేరారు. చిరంజీవి, సినిమా యూనిట్ సభ్యులు రాజేష్, సతీష్ క్వాలిస్ వాహనంలో బెంగళూరు బయలుదేరారు. క్వాలిస్ వాహనాన్ని డ్రైవర్ మహంతేష్ (35) నడుపుతున్నాడు. మార్గం మద్యలో మంగళవారం వేకువ జామున 3.30 గంటల సమయంలో హాసన్ తాలుకా శాంతి గ్రామం దగ్గర ఎదురు నుండి వేగంగా వచ్చిన టిప్పర్ వాహనం క్వాలిస్ వాహనాన్ని డీకొనింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలైన అసిస్టెంట్ కెమెరా మ్యాన్ చిరంజీవి, క్వాలిస్ డ్రైవర్ మహంతేష్ దుర్మరణం చెందారు. తీవ్రగాయాలైన రాజేష్, సతీష్ లను బెంగళూరులోని నిమ్హన్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు ఉందని శాంతిగ్రామ పోలీసులు తెలిపారు.