Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎన్టీఆర్ ‘జై లవకుశ’లో మార్పులు... సీకె షాక్, రంగంలోకి చోటా!
ఎన్టీఆర్ హీరోగా కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జై లవకుశ’ మూవీ సాంకేతిక బృందంలో కీలకమైన మార్పు చోటు చేసుకుంది. ఈచిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న సికె మురళీధరన్ ఉన్నట్టుండి
హైదరాబాద్: ఎన్టీఆర్ హీరోగా కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జై లవకుశ' మూవీ సాంకేతిక బృందంలో కీలకమైన మార్పు చోటు చేసుకుంది. ఈచిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న సికె మురళీధరన్ ఉన్నట్టుండి సినిమా నుండి తప్పుకున్నారు.
బాలీవుడ్లో త్రీ ఇడియట్స్, పికె, మొహంజోదారో లాంటి భారీ చిత్రాలకు సికె మురళీధరన్ పని చేసారు. మరి ఆయన ఎందుకు ఉన్నట్టుండి తప్పుకున్నారు? దర్శకుడు, హీరోతో ఆయన అడ్జెస్ట్ కాక పోయాడా? లేక నిర్మాత కళ్యాణ్ రామ్ తో ఏమైనా విబేధాలు వచ్చాయా? అనే విషయం ఇంకా బయటకు రాలేదు.
రంగంలోకి చోటా
సికె మురళీధరన్ స్థానంలో చోటా కె నాయుడు ‘జై లవ కుశ' చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించబోతున్నారు. చోటా కె నాయుడు తెలుగులో టాప్ మోస్ట్ డిమాండింగ్ ఉన్న సినిమాటోగ్రాఫర్ అనే విషయం తెలిసిందే.
ఫస్ట్ లుక్
కాగా... 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘జై లవ కుశ' చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ను విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు కేవలం ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ మాత్రమే రిలీజైంది. మే 20న ఎన్టీఆర్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు.
రూ. 30 కోట్ల లాభం? ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ భారీ ఆశలు
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
బ్యూటిఫుల్ మూమెంట్: బాలయ్య కాళ్లకు నమస్కరించిన ఎన్టీఆర్!