Don't Miss!
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ సినిమా కూడా కాపీ కొట్టారంట, కేసు నమోదు!
హైదరాబాద్: ఈ మధ్య కాలంలో సినిమాలపై కాపీరైట్ వివాదాలు ఎక్కుయ్యాయి. కొందరు దర్శకుడు, నిర్మాతలు వేరే వాళ్ల స్టోరీలు ఎత్తుకొచ్చి, అసలు రచయితల అనుమతి లేకుండా సినిమాలు చేస్తున్నారనే ఆరోపణలు తరచూ వింటూనే ఉన్నాయి.
తాజాగా మరో సినిమా విషయంలో ఇలాంటి గొడవే జరుగుతోంది. 2013లో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన 'క్రిష్-3' సినిమా విషయంలో కాపీ వివాదం మొదలైంది. ఈ విషయంలో ఆ చిత్ర నిర్మాత రాకేశ్ రోషన్పై ముంబయిలో కేసు నమోదైంది.
ఈ సినిమా స్టోరీని సూఅర్దాన్ అనే నవల నుంచి కాపీ కొట్టారంటూ రచయిత రూప్ నారాయణ్ సోంకార్ రాకేశ్పై కాపీరైట్ చట్టం కింద కేసు పెట్టారు. తాను రాసిన సూఅర్దాన్ పుస్తక కాపీలను కూడా పోలీసులకు అందజేశారు. 2010లో తానీ పుస్తకాన్ని ప్రచురించానని, మనిషిని, జంతువుని కలిపి సృష్టించిన కొత్త ప్రాణికి మాన్వర్ అని పేరు పెట్టి ఈ కథ రాశానని నారాయణ్ వివరించారు.
క్రిష్ సినిమాలో కూడా అచ్చం ఇలాంటి పాత్రే ఉంటుందని, తన అనుమతి లేకుండా తన కథను వారు కాపీ కొట్టారని రచయిత ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ముంబయి పోలీసులు రాకేశ్పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.