Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రేమ పేరుతో కామం.... దాసరి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రం జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ రొమాంటిక్ ఫిల్మ్ అవార్డును సొంతం చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ ను అభినందించే కార్యక్రమంలో దాసరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ....ఒకప్పుడు ప్రేమకథలంటే ప్రేమ గొప్పదనాన్ని తెలియజేసేవిగా ఉండేవి. ప్రస్తుతం టాలీవుడ్లో ప్రేమకథల స్వరూపం మారిపోయింది. ప్రేమ కథల పేరుతో కామకథలు తీస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో లగడపాటి శ్రీధర్ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' వంటి చక్కని ప్రేమకథ తీసాడు అని తెలిపారు.
చిత్ర నటుడు సుధీర్ బాబుపై కూడా దాసరి ప్రశంసల వర్షం కురిపించారు. సుధీర్ హీరోగానే కాకుండా విలన్ గా కూడా చేస్తున్నాడు. విలన్ గా నటించిన వాడే ఎపిసియెంట్ పర్సన్. రజనీకాంత్, మోహన్ బాబు వంటి వారు కూడా విలన్ గా నటించి హీరోలుగా ఎదిగిన వారే. ఇంత మంచి ప్రేమ కథలో నటించినందుకు సుధీర్ ను అభినందిస్తున్నాను అని దాసరి వ్యాఖ్యానించారు.
సుధీర్ బాబు, నందిత జంటగా ఆర్.చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'. కన్నడ ‘చార్మినార్' చిత్రానికి రీమేకిది. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా-శ్రీధర్ నిర్మించారు.