Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
రుద్రమదేవి ప్రెస్మీట్: చెర్రీ సినిమాపై దాసరి కామెంట్?
హైదరాబాద్: ఈ దసర పండక్కి తెలుగు బాక్సాఫీసు వద్ద పోటీ రసవత్తరంగా ఉండబోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పలు పెద్ద సినిమాలు ఈ సారి పోటీ పడుతున్నాయి. ఇప్పటికే రూ. 80 కోట్ల బడ్జెట్ మూవీ ‘రుద్రమదేవి' విడుదలైన డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు కేవలం 1 వారం గ్యాపుతో అంటే అక్టోబర్ 16న రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ' విడుదల కాబోతోంది. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.
మరో వైపు అఖిల్ నటించిన తొలి సినిమా కూడా ‘బ్రూస్ లీ'కి వారం గ్యాపుతో అక్టోబర్ 22న విడుదల చేయాలని నిర్ణయించారు. వివి వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇలా పెద్ద సినిమాలన్నీ తక్కవ గ్యాప్ తో విడుదల కావడం వ్యాపార పరంగా అంత మంచిది కాదని అంటున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. రుద్రమ దేవి చారిత్రక చిత్రం, ఇలాంటి సినిమాలు బ్రతకాలంటే మరుసటి వారం పెద్ద సినిమాలు విడుదల కావడం మంచిది కాదు. పెద్ద హీరోలు కూడా పండుగల కోసం వెంపర్లాడటం బాధాకరం అని దాసరి అన్నట్లు తెలుస్తోంది. దాసరి కామెంట్స్ రామ్ చరణ్ ‘బ్రూస్ లీ' సినిమా గురించే అని అంటున్నారు.
రుద్రమదేవి గురించి దాసరి మాట్లాడుతూ...ఆదివారం రాత్రి ‘రుద్రమదేవి' సినిమా చూశాను. ఇది చాలా డేంజర్ జానర్. హిస్టారికల్ సినిమా తీయడం చాలా పెద్ద సాహసం. అల్లూరి సీతారామరాజు తాండ్ర పాపారాయుడు తర్వాత తెలుగులో వచ్చిన తొలి చారిత్రక సినిమా రుద్రమదేవే. ఐతే ఈ రోజుల్లో ఇలాంటి సినిమా తీయడం చాలా పెద్ద సాహసం. కమర్షియాలిటీ పేరుతో ఏదేదో చేస్తున్నారు. నేనైతే ఈ రోజుల్లో రుద్రమదేవి లాంటి సాహసోపేత సినిమా చేసేవాణ్ని కాదు. మరి గుణశేఖర్ ఎందుకంత ధైర్యం చేశాడో తెలియదు. రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యం గురించి చెప్పాలన్న మక్కువతోనే సినిమా చేసినట్లున్నాడు. చాలా ఏళ్లు కష్టపడ్డాడు. ఆ కష్టం అలాంటిలాంటిది కాదు. అది అర్థం చేసుకునే ప్రతి ఒక్కరూ ఈ సినిమా బాగా ఆడాలని కోరుకున్నారు' అన్నారు.
మరో వైపు బ్రూస్ లీ సినిమా విడుదల వాయిదా వేయాలని కోరుతూ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ చిరంజీవికి లేఖ రాసారు. బాహుబలి సినిమా విడుదల సమయంలో నిర్మాతల కోరిక మేరకు మహేష్ బాబు ‘శ్రీమంతుడు' వాయిదా వేసిన విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని, బ్రూస్ లీ సినిమాను వాయిదే వేయాలని ఆ లేఖలో కోరారు.