Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఫేస్ బుక్ లో జయప్రద అసభ్య చిత్రాలు..కంప్లైంట్
రాజ్యసభ ఎంపి అమర్సింగ్తో కలసివచ్చి ఆమె పోలీసు శాఖలోని ఆర్ధికనేరాల విభాగానికి ఫిర్యాదు చేశారు. తన ఫేస్బుక్ అకౌంట్ను హ్యాక్ చేసి ఈ ఫొటోలను అప్లోడ్ చేశారని ఆమె ఆరోపించారు. దాంతో పలువురు ఆ కృత్రిమంగా సృష్టించిన అసభ్య ఫొటోలను వీక్షించారని చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఇదిలా ఉంటే జయప్రధ నిర్మాతగా మారి ఓ రీమేక్ చిత్రం అందించనున్నారు. ఆ రీమేక్ మరేదో కాదు..తెలుగులో సూపర్ హిట్ అయిన 'మాతృదేవోభవ'. అయితే ఈ చిత్రాన్ని ఆమె భోజపురి భాషలో నిర్మిస్తూ కీ రోల్ లో నటిస్తున్నారు. ఇప్పుడీ సినిమాను జయప్రద భోజ్పురిలో చేస్తున్నారు. ఆమె సరసన భోజ్పురి సూపర్స్టార్ మనోజ్ తివారి నటిస్తున్నారు. కేడీ దర్శకత్వంలో స్టూడియో 9 ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఇక ఇటీవల కొన్ని సినిమాల్లో కీలకమైన పాత్రలు చేసిన ప్రస్తుతం భోజ్పురి భాషలో ఆమె ఒక చిత్రంలో నటించబోతున్నారు. తెలుగు తెరపై కన్నీటి వర్షాన్ని కురిపించిన 'మాతృదేవోభవ'కు రీమేక్ ఇది. అమ్మా నాన్న.. నలుగురు పిల్లలలు చుట్టూ సాగే కథ ఇది. తండ్రి హత్యకు గురవుతాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే తల్లిని కేన్సర్ మహమ్మారి ఆక్రమిస్తుంది. చనిపోయేలోపు నలుగురు పిల్లలను దత్తత ఇవ్వడానికి ఆ తల్లి పడే ఆరాటం అందరి కంట తడిపెట్టించింది.
దాదాపు ఇరవై సంవత్సరాలు గడిచినా 'మాతృదేవోభవ' చిత్రం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. ఈ చిత్రంలో వేటూరి రాసిన 'రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే...' పాటకు జాతీయ అవార్డు వచ్చింది. అంతగా ప్రేక్షకుల్ని హత్తుకున్న ఈ చిత్రంలో మాధవి అద్భుతంగా చేసిన పాత్రను జయప్రద చేయబోతున్నారు. నాజర్ పాత్రను భోజ్పురిలో ప్రముఖ నటుడైన మనోజ్ తివారీ చేయబోతున్నారు. దినకర్ కపూర్ దర్శకత్వంలో జయప్రద నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో ఆరంభం కానుంది. ఇది కాకుండా భవిష్యత్తులో జయప్రద మరిన్ని చిత్రాలు నిర్మించాలనుకుంటున్నారు. అందుకని ముంబయ్లోని జుహూలో ఆఫీస్ ఆరంభించారని, గుర్గావ్లో ఇల్లు తీసుకున్నారని సమాచారం.