Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'బాహుబలి' లో దేవకట్టా రాసిన డైలాగు ఇదే
హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా టైటిల్స్ లో దర్శకుడు దేవా కట్టకు థాంక్స్ చెబుతూ కూడా ఓ టైటిల్ వేయించాడు దర్శకుడు రాజమౌళి. దానికి కాణం ఈ సినిమా కోసం దేవా కట్ట కొన్ని డైలాగ్స్ రాసిచ్చారనే సంగతి తెలిసిందే. సినిమా క్లైమాక్స్లో ఫ్రభాస్ చెప్పే డైలాగులు ఈయనే రాసాడంటూ వార్తలు వచ్చాయి. ‘బాహుబలి' కోసం దేవా కట్ట కాంట్రిబ్యూషన్ చిన్నదే అయినా రాజమౌళి ఆయన్ను మరిచిపోలేదు. అందుకే ఆయనకు క్రెడిట్ ఇస్తూ థాంక్స్ కార్డు వేయించాడు. దీనిపై దేవా కట్ట సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసాడు. ఇంతకీ దేవకట్టా రాసిన డైలాగు ఏమిటీ అంటే...
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
"నాతో వచ్చేదెవరు...నాతో చచ్చేదెవరు...చావుని దాటుకుని నాతో బ్రతికేదెవరు !"
క్లైమాక్స్ లో తన సైనికులను ఉద్దేసించి ఇన్సిప్రేషన్ గా చెప్పే ఈ అద్బుతమైన డైలాగుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రమ్యకృష్ణకు సైతం కొన్ని డైలాగులు ఆయన రాసారు.
దేవకట్టా ట్వీట్ చేస్తూ... ‘బాహుబలిలో వార్ సమయంలో ప్రభాస్ చెప్పే స్పీచులు కేవలం కొన్ని పదాలు మాత్రమే నేను రాసాను. రాజమౌళి సృష్టించిన బాహుబలి సముద్రంలో నేను చేసింది నీటి చుక్కంత మాత్రమే. అంత మాత్రానికే రాజమౌళి నాకు థాంక్స్ కార్డు వేయించాడు. అది రాజమౌళి గొప్పతనం' అంటూ దేవా కట్ట చెప్పుకొచ్చారు.