Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వక్కంతం,ఎన్టీఆర్ ప్రాజెక్టు కాన్సిల్ కి కారణం చెప్పిన కళ్యాణ్ రామ్
హైదరాబాద్ : గత కొంతకాలంగా ఎన్టీఆర్ హీరోగా.., వక్కంతం వంశీ దర్శకత్వంలో, కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఓ చిత్రం రాబోతోందని ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఎన్టీఆర్ పుట్టిన రోజున ఈ విషయం ఖరారు చేస్తూ పోస్టర్స్ సైతం వేసారు. అయితే అంతా ఖరారు అనుకున్న సమయంలో సీన్ రివర్స్ అయ్యింది. వక్కంతం సైడ్ లైన్ అయ్యారు. దీనికి కారణం ఎవరికి తోచింది వారు చెప్పుకున్నారు. కానీ తాజాగా కళ్యాణ్ రామ్ ఈ విషయమై మాట్లాడారు.
వక్కంతం వంశీ చెప్పిన కథ నచ్చలేదు. అందుకే, ఎన్టీఆర్ హీరోగా వంశీ దర్శకత్వంలో చేయాలనుకున్న సినిమా పక్కన పెట్టేశాం అని తేల్చి చెప్పారు హీరో కళ్యాణ్ రామ్.
పటాస్ సినిమాతో చాలా కాలం తరువాత ఫాంలోకి వచ్చిన యంగ్ హీరో కళ్యాణ్ రామ్, ప్రస్తుతం ఇజం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తన కెరీర్ లోనే బిగెస్ట్ బడ్జెట్ తో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఇజం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని క్లియర్ చేసారు.
ఇక ఇజం చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని పక్కాగా రెడీ అయిపోయింది. సెన్సార్ బృందం ఈ సినిమాకు 'యూ/ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. పూరీ స్టైల్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయిన ఈ సినిమాలో అదితి ఆర్య హీరోయిన్గా నటించారు. అనూప్ రూబెన్స్ అందించిన ఆడియో ఈమధ్యే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది.
కళ్యాణ్ రామ్ ఓ జర్నలిస్ట్గా కనిపించనున్న 'ఇజం', ఇంటర్నేషనల్ బ్లాక్మనీ అనే అంశంపై తెరకెక్కిందని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ స్వయంగా ఈ సినిమాను నిర్మించారు.