Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఒక నిర్మాత అరెస్టు..మరొకరకి వారెంట్
బెంగళూరు: కన్నడ చిత్ర నిర్మాత దినేష్గాంధీను జేపీనగర ఠాణా పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. హూ, వీరమదకరి తదితర చిత్రాలకు దినేష్గాంధీ నిర్మాతగా వ్యవహరించారు. చెక్కు బౌన్సు కేసులో కోర్టు విచారణకు గైర్హాజరవుతూ వస్తున్న ఆయనను అరెస్టు చేయాలని న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు అరెస్టు చేశారు. చెక్కు బౌన్సు కేసులో ఆయనను సంజయనగర ఠాణా పోలీసులు కూడా గతంలో అరెస్టు చేశారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
మరో ప్రక్క ఇంకో సినీ నిర్మాత పార్వతమ్మ రాజ్కుమార్కు ఈఎస్ఐ, పీఎఫ్ వారెంట్లను పంపించారని దీనిపై చర్య తీసుకోవాలని జనతాదళ్ సభ్యుడు సందేష్నాగరాజు కోరారు. కార్మికులకు సంబంధించిన నగదు చెల్లించలేదని ఆరెండు సంస్థలు ఆమెను బంధించేందుకు వారెంట్లను జారీ చేసినట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతలు సినిమాలు నిర్మించడం సాధ్యం కాదన్నారు.
సినీ చిత్రీకరణలు ఏడాది పాటు జరగవని- ఏడాదికి 20 నుంచి 40 రోజులు కార్మికులకు పని ఉంటుందని ఇలాంటి పరిస్థితుల్లో ఈఎస్ఐ, పీఎఫ్ ఏవిధంగా భర్తీ చేయాలని ప్రశ్నించారు. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పరమేశ్వర్నాయక్ హామీ ఇచ్చారు.