Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నన్ను క్షమించండి.... మీడియా ముందు సారీ చెప్పిన దర్శకుడు
"ఒక మంచి సినిమాని తీసాం కాని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా విడుదల తేదీని కొంచెం మార్చాల్సి వస్తోంది. ఈ సినిమాకోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు, వారందరికి సారీ చెబుతున్నా." అంటూ "జనతా గ్యారేజ్" దర్శకుడు కొరటాల శివ యంగ్ టైగర్ అభిమానులకు సారీ చెప్పారు. జనతా గ్యారేజ్ రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దానికోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో దర్శక నిర్మాతలు మాట్లాడారు.
''ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ మలయాళ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అతను నటించిన ప్రతి సినిమా అక్కడ రిలీజ్ అయ్యుంటే అక్కడ కూడా అతనికి మంచి ఫాలోయింగ్ ఏర్పడేది. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. 'జనతా గ్యారేజ్' ఎన్టీఆర్కి అక్కడ మంచి లాంచ అవుతుందని మోహనలాల్గారు సినిమా మొదలైనప్పటి నుంచి చెబుతున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక ఆయన అన్న ప్రతి మాట నిజం అవుతుంది'' అని కొరటాల శివ అన్నారు.
ఎన్టీఆర్ కథానాయకుడిగా ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'జనతా గ్యారేజ్'. సమంత, నిత్యామీనన నాయికలు, మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన ఎర్నేని, మోహన, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొరటాల శివ మాట్లాడుతూ ''మంచి సినిమా తీసినప్పుడు విడుదల తేదీని పొడిగించడంలో తప్పేమీ లేదు. సినిమా బాగా తీసి, కంగారుగా పోస్ట్ ప్రొడక్షన పనులు చేసేసి విడుదల చేస్తే ఫలితం మరోలా ఉంటుంది. అందుకే కావలసినంత సమయం తీసుకుని పోస్ట్ ప్రొడక్షన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
దాంతో విడుదల ఆలస్యం అవుతోంది. సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు సారీ చెబుతున్నా. మంచి ప్రొడక్ట్ను ప్రేక్షకులకు అందించడం కోసమే విడుదల తేదీలో చిన్న మార్పు చేశాం. ఇప్పటి వరకు చూడని ఎన్టీఆర్ని ఈ సినిమాలో చూస్తారు. కథలో ఉన్న స్పాన్ కు ఏమాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ నటన ఉంటుంది. సినిమా రిలీజ్ డేట్ మారిందనగానే రీషూట్ అని, ఇంకేదో అని రకరకాల వార్తలొస్తుంటాయి. మా సినిమాకు ఆ అవసరం లేదు'' అని అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ ''టాప్ టెక్నీషియన్లు, ఆర్టిస్ట్ లు పని చేసిన ఈ చిత్రం అందరూ గర్వపడేలా ఉంటుంది. ఆగస్ట్ ఒకటి లేదా రెండో వారంలో పాటల్ని విడుదల చేసి, సెప్టెంబర్ 2న సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తాం'' అని చెప్పారు.