Don't Miss!
- News KTR: రాముడిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఫేస్ బుక్ స్టేటస్ ని కాపీ కొట్టిన పూరీ జగన్నాథ్, ఇలా చేసాడేంటి?
హైదరాబాద్: సాధారణంగా సినిమావాళ్లు ప్రక్క సినిమాలు చూసి కాపీ కొడతారు, సీన్స్ లేపుతారు అంటూంటాం. అయితే తన పదునైన డైలాగ్స్ తో సమాజాన్ని తట్టి లేపే ప్రయత్నం చేస్తూ పోకిరి, ఇడియిట్, బిజినెస్ మ్యాన్ చిత్రాలలో పవర్ ఫుల్ డైలాగులు రాసి తన మాటలకు ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న పూరీ జగన్నాథ్ ..ఫేస్ బుక్ పోస్ట్ ని సైతం కాపీ కొట్టాడంటే నమ్మబుద్ది కాదు..కానీ సాక్ష్యాలు ఎదురుగా కనపడుతూంటే నమ్మకండా ఉండలేం కదా. అదేంటే మీరు క్రింద మీరు చూడండి.
ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుచేయడంతో చిల్లర కోసం సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. రోజుల తరబడి ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరగాల్సి వస్తోంది. పెద్ద నోట్లు రద్దు చేసి కొత్త నోట్లను ప్రవేశపెట్టిన సందర్భంగా దర్శకుడు పూరీ జగన్నాథ్ తన అభిప్రాయాన్ని ఇలా వివరించారు.
''రెండువేల నోటుకి చిల్లర మార్చగలిగితే వాడిని వీరుడు అంటారు. అదే రెండువేల నోటుకి చిల్లర ఇచ్చేవాడిని దేవుడు అంటారు'' అంటూ పూరీ ఫేస్బుక్లో పోస్ట్చేశారు. అంతవరకూ బాగానే ఉంది.
అయితే ఇదే పోస్ట్ ని ఇదే పోస్ట్ ని ఎన్ ఎమ్ ఆర్ మహేష్ అనే అతను పెట్టడంతో సోషల్ మీడియాలో ఇది చర్చనీయాంశంగా మారింది. ఆయన ఈ విషయం తెలియచేస్తూ ఓ పోస్ట్ కూడా పెట్టారు చూడండి.
ప్రస్తుతం పూరి జగన్నాథ్ తన తదుపరి హీరో కోసం వెతికే ప్రయత్నంలో ఉన్నారు. కళ్యాణ్ రామ్ తో ఆయన రీసెంట్ గా చేసిన ఇజం చిత్రం ఊహించని విధంగా ఫెయిల్యూర్ కావటం నిరాశకలిగించింది. ఆయన ఎన్టీఆర్, మహేష్ ల కోసం కథలు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారి డేట్స్ దొరికేలోగా..ఓ చిన్న హీరోతో సినిమా పూర్తి చేసే అవకాసం ఉందని తెలుస్తోంది.