twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆశపడొద్దు..అలాంటిదేమీ లేదంటూ డైరక్టర్ ఖండించేసాడు

    By Srikanya
    |

    హైదరాబాద్ : దగ్గుపాటి వెంకటేష్, రానా కంబినేషన్ లో మనం తరహాలో ఓ మల్టిస్టారర్ రాబోతోందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రాన్ని క్షణం దర్శకుడు రవికాంత్ పేరేపు డైరక్ట్ చేస్తున్నారని సైతం నిన్నంతా మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని ఖండించారు రవికాంత్.

    రవికాంత్ మాట్లాడుతూ.. "నేను దగ్గుపాటి హీరోలకు ఏ స్క్రిప్టునూ నేరేట్ చెయ్యలేదు. నేను ప్రస్తుతం రాస్తున్న స్క్రిప్టుని ఫినిష్ చేసే పనిలో ఉన్నాను...త్వరలోనే నా తదుపరి చిత్రం ఎనౌన్సమెంట్ వస్తుంది ", అన్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం రానా కు ఈ దర్శకుడు ఓ కథని నేరేట్ చేసాడని, అయితే ఆ ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదాని తెలియాలి. అయితే అది మల్టిస్టారర్ కథ మాత్రం కాదని వినికిడి.

    ఇక ప్రస్తుతం రానా..బాహుబలి 2 బిజీలో ఉన్నారు. దాంతో పాటు రానా హీరోగా నటించిన 'ఘాజీ' చిత్రం కోసం ఆయన అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ రెండు వెర్షన్స్ కి సంబంధించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు వున్నారు.

    Director Ravikanth Perepu denies doing with Daggupati movie

    భారీ నిర్మాణ విలువలతో జనవరిలో ప్రారంభమైన ఈ సినిమా కథానుసారం నీటి లోపల ఒక ప్రధానమైన యుద్ధ ఘట్టం కూడా చిత్రీకరించారు. ఇప్పటికే సర్టిఫైడ్ డైవర్ అయిన రానా ఈ పీరియడ్ డ్రామా కోసం ప్రత్యేకించి "అండర్ వాటర్" పాఠాలేమీ నేర్చుకోలేదు కానీ, కొద్దిగా రిహార్సల్స్ చేశారు.

    ఇండో - పాక్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కే సినిమా కావడంతో, సహజత్వం కోసం కొంతమంది పాకిస్తాన్ రంగస్థల నటులను కూడా తీసుకున్నారట.ఈ సినిమాలో రానా నేవీ ఆఫీసర్ గా నటించాడు. ఈ పాత్రలో సహజత్వాన్ని తీసుకురావడానికి ఆయన సీనియర్ నేవీ అధికారుల సలహాలను .. సూచనలను తీసుకుని ఈ పాత్రను పోషించడం విశేషం.

    1971లో జరిగిన భారత - పాకిస్థాన్ యుద్ధంలో మనపై దాడికి వచ్చిన పాకిస్థాన్ జలాంతర్గామి "పి.ఎన్.ఎస్. ఘాజీ" ని విశాఖపట్నం సముద్రతీరంలో భారతీయ సైనికులు తెలివిగా ముంచి వేశారు. ఆ ఘట్టాన్ని నేపథ్యంగా తీసుకొని చేస్తున్న సినిమా "ఘాజీ". ఈ చిత్రంలో కోస్ట్ గార్డ్స్‌లో ఎస్-21 అనే నౌకాదళ అధికారి పాత్రను రానా పోషిస్తున్నారు. ''ఇది ఒక అద్భుతమైన వాస్తవ కథ

    English summary
    Director Ravikanth Perepu of "Kshanam" fame has literally rejected the idea of directing both Rana and Venkatesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X