Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అది..మురళీ మోహన్ ఆర్టిస్ట్ అసోసియేషన్గా మారింది
హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(మా) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ‘మా' అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న రాజేంద్రప్రసాద్, జయసుధ మధ్య పోటీ వాతావరణం రాజకీయ ఎన్నికలను తలపిస్తోంది. ఆర్టిస్టులంతా వీరిద్దరి తరుపున రెండు గ్రూఫులుగా విడిపోయారు.
రాజేంద్రప్రసాద్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా..... మురళీ మోమన్ తను ఈ సారి మళ్లీ పోటీ చేయకుండా జయసుధను రంగంలోకి దింపారు. అయితే ఇప్పటి వరకు ‘మా' అధ్యక్షుడిగా ఉన్న మురళీ మోహన్ పై పలువురు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.
మురళీమోహన్ పై దర్శకుడు శ్రీనాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మా అంటే మురళీమోహన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ గా తయారు చేశారని ఆయన విమర్శించారు. ఆయన చాలా కాలం పాటు 'మా' అధ్యక్ష పదవిని నిర్వహించారని, చంద్రబాబు వద్ద పనిచేసినా కూడా.. 'మా' కోసం ఒక్క భవనం కూడా తీసుకురాలేకపోయారని శ్రీనాథ్ విమర్శించారు. అన్ని పదవులూ మురళీమోహనే అనుభవించాలనుకుంటున్నారని, బతికున్న లెజెండ్స్ ను మర్చిపోయి.. చనిపోయినవారి కోసం మృత్యుంజయ హోమం చేయించారని దర్శకుడు శ్రీనాథ్ అన్నారు.